కౌన్ బనేగ కరోర్ పతి షోతో బుల్లితెర టాప్ హీరోగా మారిపోయి గత కొన్ని సంవత్సరాలుగా బుల్లి తెరను ఏలుతున్న అమితాబ్ బచన్ కు అదే బుల్లితెర అనుకోని షాక్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటిదాకా ఎంతోమందిని కరోర్ పతులను చేసిన అమితాబ్ తన రూట్ మార్చుకుని బుల్లితెరను ఊపేద్దామనుకుని సోనీ టీవీలో అత్యంత భారీ బడ్జెట్ తో అమితాబ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘‘యుధ్’’ సీరియల్ వీక్షకులకు నచ్చక పోవడంతో ఈ సీరియల్ కు చాల తక్కువ రేటింగ్స్ వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.  ప్రతిరోజు సోనీ టీవీలో రాత్రి 10.30 గంటలకు ప్రసారయ్యే ఈ సీరియల్ ఏ వర్గం బుల్లి తెర ప్రేక్షకులను అలరించక పోవడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ సీరియల్ రేటింగ్ 0.7 అని వార్తలు వస్తున్నాయి. ఇండియన్ టెలివిజన్‌పై అతి కాస్ట్‌లీ ప్రాజెక్ట్ అయిన ‘‘యుధ్’’ ఒక్కో ఎపిసోడ్‌కి కోట్లు ఖర్చుపెడుతున్నప్పటికీ ప్రేక్షకులు పెదవి విరిచేస్తున్నారని రేటింగ్స్ లెక్కలు చెబుతున్నాయి. దీనితో ఈ కార్యక్రమ నిర్వాహకులు ఏమి చేయాలో తెలియక దిగాలు పడుతున్నారని టాక్. అయితే ముందుముందు ‘‘యుధ్’’కి ఆదరణ పెరుగుతుందనే కొండంత ఆశతో ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: