టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న హీరో బన్నీ. అల్లుఅర్జున్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. రేసుగుర్రం మూవీతో మరింత సక్సెస్ ఫాంలో ఉన్న అల్లుఅర్జున్ ప్రస్తుతం రుద్రమదేవి మూవీకి సంబంధించిన షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. రుద్రమదేవి మూవీలో గోన గన్నా రెడ్డి పాత్రలో నటిస్తున్న అల్లు అర్జున్, తన కెరీర్ లోనే ఎన్నడూ చేయని పాత్రని చేస్తున్నాడు. గుణ శేఖర్ సైతం అల్లుఅర్జున్ కోసం సహజత్వానికి దగ్గరగా ఉండే స్క్రీన్ ప్లేని రెడీ చేసుకున్నాడంట. ఇదిలా ఉంటే తాజాగా అల్లుఅర్జున్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సుకుమార్ కాంబినేషన్ లో అల్లుఅర్జున్ ఓ మూవీ చేయబోతున్నాడనే విషయం తెలిసిందే. అయితే ఈ కాంబినేషన్ లో అల్లుఅర్జున్ హీరోగా ఉంటే, సుకుమార్ దర్శకుడిగా కాకుండా నిర్మాతగా ఉంటున్నాడు. సుకుమార్, అల్లుఅర్జున్ హీరోగా ఓ భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులని సుకుమార్ ఇప్పటికే స్టార్ట్ చేశాడు. అల్లుఅర్జున్ వద్ద నుండి కాల్షీట్స్ ని ఇప్పటికే సుకుమార్ తీసుకున్నాడు. అలాగే రెమ్యునరేషన్ కి సంబంధించిన డిటైల్స్ ని సైతం సుకుమార్ మాట్లాడుకొని అగ్రిమెంట్స్ వరకూ వ్యవహారం వెళ్ళిందని అంటున్నారు. సుకుమార్, అల్లుఅర్జున్ కి దాదాపు గా 15 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ ని ఇస్తానన్నట్టుగా తెలుస్తుంది. ఈ న్యూస్ ఫిల్మ్ నగర్ లో తెగ చెక్కర్లు కొడుతుంది. మొత్తంగా సుకుమార్ నిర్మాతగా మారిన తరువాత హీరోలకు సంబంధించిన విషయంలో రెమ్యునరేషన్ బాగానే ఇస్తున్నప్పటికీ, ఇతర విభాగాల్లో మాత్రం చాలా పొదుపుగా ఉన్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: