టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న కాజల్ అగర్వాల్, తరువాత స్పీడుని తగ్గించింది. కొంత కాలం పాటు కాజల్ కి అవకాశాలు లేకుండా పోయాయి. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితానికి కొంత సమయాన్ని కేటాయించుకోవాలి అంటూ గత కొంత కాలం తను రెండు నెలల పాటు షూటింగ్స్ ని కాన్సిల్ చేసుకొని ఇంటిపట్టునే ఉంది. ఆ సమయంలో నిర్మాతలు చాలా నష్టపోయారనే టాక్ వచ్చింది. దీంతో ఆ గ్యాప్ లో సమంత, అనుష్క, తమన్నలని అందరూ ప్రిబుక్ చేసుకున్నారు. తరువాత సీన్ కట్ కాజల్ అగర్వాల్ కి సినిమాలే లేకుండా పోయాయి. తిరిగి హీరోలు, ప్రొడ్యూజర్స్ దగ్గర కమిట్మెంట్స్ తీసుకోవటానికి దాదాపు మరో నాలుగు నెలల సమయం పట్టింది. ఆ విధంగా కాజల్ తీసుకున్న నిర్ణయం తన ఫిల్మ్ కెరీర్ నే దెబ్బతీసేలా ఉంది. ఇదిలా ఉంటే గతంలో కాజల్ అగర్వాల్ తన రెమ్యునరేషన్ ని కోటి రూపాయల వరకూ పెంచుకుంది. ఆ తరువాత సినిమాలు లేకపోవటంతో ఇప్పుడు 80 లక్షల వరకూ రెమ్యునరేషన్ ని తీసుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ కాజల్ అగర్వాల్ ఫాంలోకి వస్తుంది. అటు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ రెండు మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కోలీవుడ్ లోనూ రెండు మూవీలను చేస్తుంది. టాలీవుడ్ లోనూ ఒక మూవీకి సంబంధించిన షూటింగ్ లో పార్టిసిపెట్ చేయగా, మరో రెండు మూవీలకి గ్రీన్ సిగ్నల్ చేసింది. దీంతో కాజల్ కూడ ఫుల్ బిజి అయిందన్న మాట. ఇదిలా ఉంటే తాజాగా కాజల్ ని హీరోయిన్ గా తీసుకోవాలని తన వద్దకు ఓ ప్రొడ్యూజర్ వస్తే, తను హీరోయిన్ గా చేయాలంటే కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే నంటూ స్ట్రాంగ్ గా చెప్సేసిందట. దాంతో ఆ నిర్మాత అక్కడ నుండి జారుకున్నాడు. కాజల్ అంతటితో ఆగకుండా తన వద్దకు వస్తున్న నిర్మాతలకి కోటిన్నర రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తుందట. ఒక్కోసారి బెదిరిస్తుందంటూ కూడ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: