ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత చాలానే ఉంది. ఎంత కొరత ఉన్నప్పటికీ తెలుగు హీరోయిన్స్ మాత్రం టాలీవుడ్ స్క్రీన్ ని లీడ్ చేయలేకపోతున్నారు. అతి కొద్ది మంది హీరోయిన్స్ ఉన్నప్పటికీ వారికి అవకాశాలు కూడ తక్కువుగానే వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ క్రేజీ మల్టీస్టారర్ మూవీలో తెలుగు హీరోయిన్ మధుశాలిని నటించనుంది. విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని నానక్రాం గూడాలో వేసిన ఓ సెట్లో శరవేగంగా జరుగుతోంది. వెంకటేష్ ఓ మిడిల్ క్లాస్ షాప్ ఓనర్ గా, పవన్ కళ్యాణ్ శ్రీ కృష్ణుడిగా ఈ మూవీలో కనిపించనున్నారు. ఈ మూవీలో హైదరాబాదీ హీరోయిన్ అయిన మధు శాలిని, గోపాల గోపాల మూవీలో నటించేందుకు ఆఫర్ ని చేజిక్కించుకుంది. మధు శాలిని ఇందులో వచ్చే ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. మధుశాలిని పాత్ర చాలా కీలకం అని చిత్ర యూనిట్ చెబుతుంది. ప్రస్తుతం మధుశాలిని కి సంబంధించిన పార్ట్ ని షూటింగ్ చేస్తున్నారు. సురేష్ బాబు, శరత్ మరార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కిషోర్ కుమార్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రియ శరన్ నటిస్తోంది. హిందీలో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ సినిమాకి రీమేక్ గా తెలుగులో ‘గోపాల గోపాల’గా 2015 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: