ఛార్మి పెద్ద ప్రమాదం నుంచి బయట పడింది అనే వార్తలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. నిన్న ఉదయం వైజాగ్ వెళ్ళడం కోసం ఇండిగో ఫ్లైట్ లో వెళుతున్న ఛార్మీకి ఆ ఫ్లైట్ లాండింగ్ అవుతుందనగా అనుకోని ప్రమాదం ఎదురైంది అని ఆమె తన ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు తెలియచేసింది. ఆమె ట్విట్ ఇలా కొనసాగింది "ఒక్కసారిగా 100 అడుగుల కిందకు ఫ్లైట్ పడిపోయినట్టు అనిపించింది. చాలా భయం వేసింది. నా టీ కింద పడింది. ప్రయాణికులు అందరూ కింద పడిపోయారు. ఇదే చివరి రోజు అనుకున్నాం. అంతేకాదు ఫ్లైట్ లో కుదుపులు ప్రారంభం అయ్యాయి ఇక ప్రాణాలు పోయాయి అనుకున్నా. ఇదే చివరి శ్వాస అని ఫీల్ అయ్యాను. కాని ఏమి జరగలేదు. విమానం నుండి నెల పై దిగినా ఆ షాక్ నుండి ఇంకా తేరుకోలేక పోతున్నాను’ అంటూ ఆ సంఘటనను కళ్ళకు కట్టే విధంగా తన అభిమానులకు తన ట్విటర్ ద్వారా తెలియచేసింది చార్మీ.  ఈ మధ్యనే తన పై మీడియాలో వస్తున్న తన పెళ్ళి వార్తలను ఖండించి పెళ్లికన్నా తన కెరియర్ ను చక్క దిద్దుకునే పనిలో బిజీగా ఉన్నాను అని చెప్పిన ఛార్మీ ఎటువంటి ప్రమాదం లేకుండా బయటకు రావడం ఆమె అదృష్టం అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: