టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ ఫిల్మ్స్ కి రచయితగా పనిచేసిన రైటర్ కోనవెంకట్. కోన వెంకటన్ కి, డైరెక్టర్ శ్రీనువైట్ల మధ్య సరైన వాతావరణం లేదనేది టాలీవుడ్ లో అందరికి తెలిసిన ఓపెన్ టాక్. ఇదిలా ఉంటే తాజాగా కోనవెంకట్ మరోసారి సంచలనంగా మారాడు. తను దాదాపు నాలుగు బాలీవుడ్ ఫిల్మ్స్ కి రైటర్ గా వర్క్ చేస్తూ ఫుల్ బిజి షెడ్యూల్ ని గడుపుతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో హయ్యస్ట్ పెయిడ్ రచయిత ఎవరంటే కోన వెంకట్ పేరే వినపడుతుంది. తను ఒక్క సినిమాకు దాదాపు కోటి రూపాయలు తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని తనే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా తను ఏ మాత్రం భయం లేకుండా తన రెమ్యురేషన్ డిటైల్స్ ని బయటకు చెప్పేసాడు. అలాగే శ్రీను వైట్లకీ, తనకీ మధ్య వున్న విభేదాల గురించి కూడా ప్రస్తావించాడు. తన జీవితంలో మరచిపోలేని వ్యక్తి శ్రీనువైట్ల అంటూ తెగ మండిపడ్డాడు. తను లేని లోటు ఏంటో ఇప్పుడు శ్రీనువైట్ల అర్ధం అవుతుంది అని కామెంట్ చేశాడంట. ఈ విషయం టాలీవుడ్ లో స్ప్రెడ్ అయి హాట్ టాపిక్ గా మారుతుంది. త్వరలో ఆగడు మూవీ రిలీజ్ ఉంది. అందులో డైలాగ్స్, స్టోరి కొంత వీక్ గా ఉందనేది ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్. మొత్తానికి శ్రీనువైట్ల ఆగడు మూవీని బ్లాక్ బాస్టర్ చేయకపోతే, కోనవెంకట్ చేసిన కామెంట్స్ నిజం అయ్యేలా ఉన్నాయి. అలాగే తను ఇచ్చిన ఇంటర్వూలో ఇంకొన్ని విషయాల గురించి మాట్లాడుతూ ‘ ‘రెడీ’ సినిమా నాకు బాలీవుడ్ లో మంచిగుర్తింపు తెచ్చింది. ఇది కాకుండా సల్మాన్ ఖాన్ నటించనున్న ‘నో ఎంట్రీ బై ఎంట్రీ’ అనే సినిమాకి కథ అందించాను. అది డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్తుంది. ఇది కాకుండా అభిషేక్ బచ్చన్ కి ఓ కథని చెప్పాను, అలాగే శ్రీదేవికి కూడా ఓ పాయింట్ చెప్పాను. అది ఆమెకు బాగా నచ్చడంతో కథ సిద్దం చేయమన్నారని’ అంటూ తన బిజి షెడ్యూల్ ని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: