దక్షిణాది సినిమా రంగంలో ఎంతమంది క్రేజీ హీరోయిన్స్ ఉన్నా ప్రస్తుతం నడుస్తున్న అనుష్క హవా అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. పాపులారిటీ విషయంలోనే కాదు ధనార్జనలో కూడ ప్రస్తుతం ఈయోగా బ్యూటీ నంబర్ వన్ గా కొనసాగుతూ నేటి హీరోయిన్స్ కు తన స్థాయిని రుచి చూపెడుతోంది.  నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర చేయాలి అంటే నేటి హీరోయిన్స్ లో అనుష్క పేరు తప్పించి మరేపేరు వినిపించడంలేదు. ఈ పరిస్థుతులకు తగ్గట్టుగానే అనుష్క తన క్రేజ్ ను డబ్బు రూపంలో పుష్కలంగా వాడేసుకుంటోంది అనే వార్తలు తెగ వినపడుతున్నాయి.  వాస్తవానికి అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్స్ లో నయనతార ముందు వరుసలో ఉన్నా ఆమె వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉండడంతో అనుష్క ధనార్జన కంటే నయనతార వెనకపడింది అని కోలీవుడ్ మీడియా టాక్. ఇక సమంత, కాజల్, త్రిష, హన్సిక లాంటి తారలు కూడా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నా అనుష్క వాణిజ్య ప్రకటనల హవా ముందు మిగతా తారల వాణిజ్య ప్రకటనలు తేలి పోతున్నాయని కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది.  ఇటీవల ఒక మొబైల్ ఫోన్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పంద పత్రాలపై సంతకం చేసిన జేజమ్మ కోటికి పైగా పారితోషికం పుచ్చుకుoదని మీడియా టాక్. దీనికి తోడు రజినీకాంత్ తో అనుష్క ‘లింగా’ సినిమాలో నటిస్తూ ఉండటంతో అనుష్క హవా కోలీవుడ్ ను ఊపెస్తోందని కోలీవుడ్ మీడియా కధనాలు రాస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: