ఒక వైపు అత్యంత భారీ స్థాయిలో మరో రెండు రోజులలో విడుదలకు ‘రభస’ సిద్ధం అవుతుంటే ఇంకా ఈ సినిమాను రకరకాల సమస్యలు వెంటాడటం సంచలనంగా మారింది. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం నిన్న రాత్రి బెల్లంకొండ సురేష్ ఇంటి ఎదురుగా మంచు కుటుంబానికి చెందిన కొంతమంది అనుచరులు బెల్లంకొండను టార్గెట్ చేస్తూ ఆందోళనకు దిగారని వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న వివరాల ప్రకారం మంచు కుటుంబం నిర్మించిన ‘ఊ కొడతారా... ఉలికిపడతారా’ సినిమా కోసం తయారుచేసిన భారీ గంధర్వ మహల్ సెట్టును బెల్లంకొండ తన ‘రభస’ సినిమా షూటింగ్ కోసం ఉపయోగించుకుని దానికి అద్దె రూపంగా 58 లక్షలు ఇస్తాను అని ఒప్పందం చేసుకుని కూడ మంచు కుటుంబానికి ఇవ్వకుండా ‘రభస’ ను విడుదల చేస్తూ ఉండటంతో మంచు కుటుంబానికి సంబంధించిన కొంతమంది అనుచరులు బెల్లంకొండను టార్గెట్ చేయడమే కాకుండా మంచు కుటుంబానికి రావలసిన మొత్తం చెల్లించ కుండా ఉంటే ఈ సినిమా విడుదల చేస్తే ఆపేయమని నిర్మాతల సంఘాన్ని ఆశ్రయిస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనితో ఫిలింనగర్‌లోని బెల్లంకొండ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది అని టాక్. పోలీసులు పరిస్థితిని అదుపు చేసి ఆందోళనకారులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది అని మీడియా వార్తలు వ్రాస్తోంది. ఇది ఇలా ఉండగా విడుదల తేదీకి కేవలం రెండే రెండు రోజులు మిగిలి ఉన్న‘రభస’ కు ఈ గొడవల రభస ఏమైనా డేమేజ్ చేస్తుందా అనే వార్తలు కూడ వినిపిస్తున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: