హీరో శివాజీ నటించిన ‘బూచమ్మా బూచోడు’ గతవారం విడుదలై ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా దర్శకుడు రేవన్ యాదు శివాజీని టార్గెట్ చేస్తూ మీడియా ఎక్కడం హాట్ న్యూస్ గా మారింది. దీనికి కారణం ఈ సినిమా ప్రచారంలో తనను పక్కనపెట్టారని దర్శకుడు రేవన్ ఆరోపణ. ఈ సినిమా ప్రమోషన్ బాధ్యతలు భుజాన వేసుకున్న హీరో శివాజీ తనను కావాలనే పక్కన పెట్టేసాడని రేవన్ గగ్గోలు పెడుతున్నాడు. అంతేకాదు జరుగుతున్న పరిస్థుతులు చూస్తూ ఉంటే తన సినిమాను తాను దర్శకత్వం వహించానని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడటం ఆశ్చర్యకరంగా ఉందని శివాజీ పై ఆరోపణలు గుప్పించాడు రేవన్.  అయితే జరుగుతున్న ఈ ప్రచారం పై వెంటనే స్పందించాడు శివాజీ. ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన దర్శకుడు రేవన్ ఇప్పుడు ఇలా మాట మార్చి మీడియా ముందుకు వచ్చి తనను టార్గెట్ చేస్తూ మాట్లాడటం చాల ఆశ్చర్యకరంగా ఉంది అంటూ కామెంట్ చేసాడు.  అంతేకాదు తాను టీవీ చానళ్లు వాళ్లు పిలిస్తే మాత్రమే వెళ్లానని, సినిమా గురించి మాట్లాడానని ఇందులో తన తప్పు ఏమిటి అంటూ ఎదురు ప్రశ్న వేస్తున్నాడు శివాజీ. అయితే ఒక ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న ఒక సినిమా క్రెడిట్ గురించి ఒక కొత్త దర్శకుడు మరో సీనియర్ హీరో మీడియా ముందుకు ఆరోపణలు చేసుకుంటూ రావడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: