ఈ సంవత్సరం చివరిలో సెట్స్ పైకి వెళ్ళవలసిన నాగార్జున, ఎన్టీఆర్ ల మల్టీ స్టారర్ సినిమా నిర్మాణం ఇంచుమించు ఆగిపోవడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ వింత ప్రవర్తన అనే మాటలు గట్టిగా ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి. ‘రభస’ పరాజయంతో అయోమయంలో పడ్డ జూనియర్ ఈ మల్టీ స్టారర్ లో తన పాత్ర బాగాలేదని దర్శకుడు వంశీ పైడి పల్లికి చెప్పడంతో ఈ విషయం నాగార్జున వరకు వెళ్లి జూనియర్ కు ఇష్టం లేని ఈ సినిమా నిర్మాణం ఆపి వేద్దాం అని నాగ్ వంశీ పైడి పల్లి దగ్గర అన్నాడని ఫిలింనగర్ టాక్. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్ళవలసిన ఈ సినిమా ఆగి పోవడానికి జూనియర్ తీసుకుంటున్న అతి జాగ్రత్తలు కారణం అని అంటున్నారు. ‘బృందావనం’ లాంటి సూపర్ హిట్ సినిమాను ఇచ్చిన వంశీ పైడి పల్లి లాంటి దర్శకుల స్క్రిప్ట్ లో కూడ జూనియర్ తన అత్యుత్సాహంతో మార్పులు చేర్పులు చేయడంతో భవిష్యత్తులో జూనియర్ వద్దకు ఇక ఏ దర్శకుడు సినిమాలు తీయడానికి భయపడతారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.  జూనియర్ లేటెస్ట్ గా నటిస్తున్న పూరి జగన్నాద్ సినిమా స్క్రిప్ట్ విషయంలో కూడ ఇదే వార్తలు హడావిడి చేసిన నేపధ్యంలో ఇక భవిష్యత్తులో జూనియర్ సినిమాలకు అతడే సొంత స్క్రిప్ట్ రాసుకుంటే దర్శకులకు ఈ తలనొప్పులు తప్పుతాయి అంటూ సెటైర్లు పడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: