బాలీవుడ్ టాప్ హీరోలు ఎంతమంది ఉన్నా అమితాబ్ క్రేజ్ ముందు అ టాప్ హీరోల క్రేజ్ ఎప్పుడు సరితూగలేదు. ఏడు పదుల వయస్సు దాటిపోయినా ఇంకా కుర్ర హీరోలతో సమానంగా అమితాబ్ స్టెప్పులు వేస్తాడు. అటువంటి బిగ్ బికి హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ఇచ్చిన షాక్ ఇప్పుడు టాపిక్ ఆఫ్ బాలీవుడ్ గా మారింది. ప్రముఖ సింగర్ బల్ వేందర్ సింగ్ ప్రవేట్ ఆల్బమ్ ఆడియో వేడుకకు అతిధులుగా అమితాబ్ ను సన్నీ లియోన్ ను కూడ ఆహ్వానించారు. ఈ వేడుకకు అనుకున్న సమయానికి అమితాబ్ రావడంతో అక్కడ ఉన్న అతిధులు అంతా ఆనందపడి అమితాబ్ చుట్టూ చేరి కుశల ప్రశ్నలు అడుగుతూ కాలక్షేపం చేసారు. అయితే ఈ కార్యక్రమానికి కొద్దిగా ఆలస్యంగా వచ్చిన సన్నీ లియోన్ ఆ ఫంక్షన్ హాలులోకి ప్రవేసించగానే ఆ ఆడియో వేడుకకు వచ్చిన అతిధులు మరియు ప్రేక్షకుల దృష్టి అంతా సన్నీ వైపు మళ్ళడంతో అమితాబ్ ను పట్టించుకునే వారే లేకపోయారట. అనుకోని ఈ సంఘటనకు చిన్నబుచ్చుకున్న అమితాబ్ మొఖంలో రంగులు మారిన విషయాన్ని గ్రహించిన ఆ ఆడియో ఫంక్షన్ నిర్వాహకులు జరిగిన తప్పును గ్రహించి ముందుగా అమితాబ్ ను వేదిక పైకి పిలిచి గౌరవించి ఆ తరువాత సన్నీని గౌరవించడంతో ఆ క్షణానికి అమితాబ్ సరిపెట్టుకున్నా సన్నీకి ఇంత క్రేజ్ ఉందా? అంటూ తన సన్నిహితుల దగ్గర కామెంట్ చేసాడు అనే వార్తలు వస్తున్నాయి. అందుకే కాబోలు పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు కూడ త్వరలోనే సన్నీ క్రేజ్ టాలీవుడ్ షేక్ చేయడం ఖాయం అని అంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: