దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు అత్యంత సన్నిహితమైన మిత్రులుగా ఒక వైపు చిరంజీవి పేరు చెపితే మరో వైపు మోహన్ బాబు పేరు చెపుతారు. రాఘవేంద్రరావు కూడ తన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్స్ ఈ ఇద్దరి హీరోలకే ఇచ్చాడు. అటువంటి దర్శకేంద్రుడుని మెగా మంచు కుటుంబాలు ఇరకాటంలో పెట్టాయి అంటూ సెటైర్లు పడుతున్నాయి. నాగార్జునతో ‘షిరిడీ సాయిబాబా’ సినిమా చేసిన తరువాత రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘ఇంటింటా అన్నమయ్య’ విడుదలకు నోచుకోకుండా బాక్సులకే పరీతం అయింది. దీనితో రాఘవేంద్రరావు హవా అయిపోయింది అనుకున్నారు అంతా. అయితే రాఘవేంద్రుడు ‘సౌందర్య లహరి’ పేరుతో తాను దర్శకత్వం వహించిన సినిమాల హీరో, హీరోయిన్స్ తో ఒక కార్యక్రమాన్ని బుల్లితెర పై నిర్వహిస్తూ మళ్ళీ పాపులారిటిలోకి వచ్చారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా వచ్చిన చిరంజీవి, మోహన్ బాబులు రాఘవేంద్రరావు దర్శకత్వంలో చరణ్, తమన్నాలను పెట్టి ‘జగధీకవీరుడు అతిలోక సుందరి’ తిరిగి రీమేక్ చేస్తే బాగుంటుందని చిరంజీవి సూచిస్తే, దర్శకేంద్రుడు దర్శకత్వంలో ‘రావణ’ గా నటించే రోజు గురించి ఎదురు చూస్తున్నాను అని మోహన్ బాబు ట్విస్ట్ ఇచ్చాడు. అయితే ఈ రెండు మాటలు విన్న రాఘవేంద్రుడు ఈ రెండు సినిమాల స్క్రిప్ట్ లను ప్రస్తుతం తయారుచేసే పనిలో పడ్డాడని వార్తలు కూడ ఉన్నాయి. అసలు రాఘవేంద్రుడు ఈ రెండు సినిమాలలో ఏది ముందు మొదలు పెడతాడు ఈ రెండు సినిమాలు నిజంగా సినిమా సెట్స్ పైకి వస్తాయా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదిఎమైనా మెగా మంచు కుటుంబాలు తమ కోరికలతో రాఘవేంద్రరావును ఇరుకున పెట్టారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: