టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగతుందో ఎవ్వరికీ అర్ధం కాదు. గతంలో దర్శకులకి మాట ఇచ్చిన హీరోలు, తరువాతి కాలంలో ఆ మాటని నిలబెట్టుకుంటారో? లేదో? అనేది చెప్పలేము. అలాగే హీరోలకి మాట ఇచ్చిన స్టార్ డైరెక్టర్స్, కొంత కాలం తరువాత వారు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటారా? అనే దానిపై కూడ నమ్మకాలు లేవు. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే ట్రెండ్ ని బట్టి మారుతుంటుంది. ఆ విధంగా ఇప్పుడు అల్లుఅర్జున్ మాట కూడ మారబోతుంది. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ సంతోష శ్రీనివాస్ కి మాట ఇచ్చిన అల్లుఅర్జున్ ఇప్పుడు ఆ మాటని కొంత కాలం పోస్ట్ పోన్ చేయబోతున్నాడు. సంతోష్ శ్రీనివాస్.. 'కందిరీగ' తర్వాత రెండేళ్లు ఖాళీగా ఉన్నా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోను మెప్పించగలిగాడు. అయితే రీసెంట్ గా విడుదలైన 'రభస'లో సీన్ కో సినిమా కనిపిస్తోందనే సెటైర్స్ తెచ్చుకున్నా .. ఎన్టీఆర్ ఇమేజ్ తో కమర్షియల్ గా ఆ సినిమా కొంత గట్టెక్కింది. అయితే మరోవైపు సంతోష్ శ్రీనివాస్ కూడా రభస సూపర్ హిట్ అనే చెప్పుకుంటున్నాడు. ఒక సినిమా పోతే మరో సినిమాకు ఛాన్స్ ఇచ్చే సంప్రదాయం టాలీవుడ్ హీరోలు చాలా తక్కువుగా ఉంటుంది. ఒప్పుప్పుడు సంతోష శ్రీనివాస్ కి మాట ఇచ్చిన అల్లుఅర్జున్, ఇప్పుడు శ్రీనివాస్ కథకి ధైర్యం చేయలేకపోతున్నాడు. గతంతో అల్లుఅర్జున్ కి కథ చెప్పిన సంతోష శ్రీనివాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ తరువాత చేద్దాం అన్నట్టు అల్లుఅర్జున్ చెప్పాడంట. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లుఅర్జున్ మూవీ స్టార్డ్ అయింది. కాని అల్లుఅర్జున్ మాత్రం సంతోష శ్రీనివాస్ చెప్పిన కథని ఇంకా కఫైనలైజ్ చేయలేదు. దీంతో రభస మూవీ బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టడంతో శ్రీనివాస్ కి అల్లుఅర్జున్ ఆఫర్ ఇవ్వకుండా, షాక్ ఇచ్చాడనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. మొత్తానికి ఈ టైం లో సంతోష్ శ్రీనివాస్ చెప్పినంత సంతోషంగా అల్లు అర్జున్ అతనికి ఛాన్స్ ఇస్తాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: