ధూమ్3 సినిమాకు తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించే సినిమా పికె. రాజ్ కుమార్ హిరాణీ డైరక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఆరంభం నుంచే చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన నాటి నుండి అందరి ద్రుష్టి పికె మూవీ మీదే ఉంది. అమీర్ ఖాన్ న్యూడ్‌గా రైలు పట్టాలపై నిల్చునే పోస్టర్‌ను చూసి అందరూ దీని గురించే హాట్ టాపిక్ గా మాట్లాడుతున్నారు. అయితే ఆ పోస్టర్ అమీర్ ఖాన్‌‌ను న్యాయపరమైన చిక్కుల్లో పడేసే పరిస్థితి వచ్చింది. రాజ్‌కుమార్ పాండే అనే న్యాయవాది ఆ పోస్టర్‌పై భోపాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు కూడ ఈ కేసుని లైట్ తీసుకొని అమీర్ ఖాన్ కి ఊరట కలిగించింది. ఇదిలా ఉంటే ఈ మూవీలో అమీర్ ఎంత సేపు న్యూడిటిగా కనిపిస్తాడు అనే దానిపై పక్కా సమాచారం బయటకు వచ్చింది. మూవీలో వచ్చే ఓ కీలక సన్నివేశంలో అమీర్ ఖాన్ దాదాపు 30 సెకండ్స్ పాటు న్యూడ్ గా కనిపిస్తాడు. మూవీలో అమీర్ ఖాన్ కనిపించే ఆ సన్నివేశాన్ని తప్పుబట్టే విధంగా ఎంత మాత్రం ఉండదని దర్శకుడు వివరించాడు. మూవీకి, కథకి ఎంతో అవసరం కాబట్టి, హీరో ఆ విధంగా న్యూడ్ యాక్టింగ్ చేయాల్సి వచ్చిందని అన్నారు. అయితే అమీర్ ఖాన్ న్యూడ్ యాక్టింగ్ రన్ టైం తెలియడంతో అన్ని సెకండ్స్ అమీర్ ఖాన్ ఏ విధంగా కనిపించబోతున్నాడు? అంటూ ఆ మూవీ కోసం తెగ ఆసక్తి చూపిస్తున్నారంట. ఈ ఏడాది డిసెంబర్‌19న ప్రేక్షకుల ముందుకు రానున్న పికె సినిమాకి రాజ్‌కుమార్‌ హిరాని దర్శకత్వం వహిస్తున్నారు. 'పీకే' సినిమా పొలిటికల్ సెటైర్ మూవీ. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమీర్ ఖాన్, అనుష్క శర్మ, సంజయ్ దత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రంలో అమీర్ ఖాన్ గగ్రా చోళీ డ్రస్ లో కనిపించనున్నాడు. తాజాగా రిలీజ్ అయితే పికె మూవీ మూడో పోస్టర్ కూడ సంచలనాన్ని క్రియోట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: