మహేష్ బాబు అభిమానులు శుక్రువారం ఉదయం కోసo క్షణాలు లెక్క పెడుతున్నారు. ‘ఆగడు’ ఎద్వాన్స్ బుకింగ్ మొన్న సోమవారం నుంచి ప్రారంభమైంది. భాగ్యనగరంలోని చాల ధియేటర్లలో కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ సోమవారం నుండి మొదలైంది. ఆన్‌లైన్ టిక్కెట్లు ప్రారంభమైన కొద్దిసేపటికే ఫస్ట్ డే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయినట్లు వార్తలు వస్తున్నాయి.  కొన్ని థియేటర్ల వద్ద అడ్వాన్స్ ఇవ్వడం మొదలుపెట్టిన కొద్ది సేపటికే తొలిరోజు టిక్కెట్లన్నీ సేల్ అయినట్లు టాక్. ఈ ‘ఆగడు’ టికెట్లకు ఏర్పడిన క్రేజ్ చూసి ట్రేడ్ వర్గాలు కూడ షాక్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా అమెరికాలో కూడా ‘ఆగడు’ సరికొత్త రికార్డులను సృస్టించడానికి ‘ఆగడు’ రెడీ కాబోతోంది.  అమెరికాలో పవన్ ‘అత్తారింటికి దారేది’ రికార్డులను తిరగ రాసే విధంగా ‘ఆగడు’ 150కి పైగా స్క్రీన్లలో విడుదలవుతోంది. ఇప్పటికే నిర్మాతలు 150 స్క్రీన్లకు సంబంధించిన లిస్టు విడుదల చేసారు. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా టిక్కెట్ల అమ్మకం కూడా జరిగిపోయింది.  తొలి సారి అమెరికాలో ఓ తెలుగు సినిమా 150కి పైగా స్క్రీన్లలో విడుదల అవడం సంచలనంగా మారింది. అదేవిధంగా ఈ సినిమాకు సంబంధించి డల్లాస్‌లో రెండు ప్రీమియర్ షోలకు సంబంధించి టిక్కెట్లు కూడ అయిపోయాయి అనే వార్తలు వస్తున్నాయి. ‘ఆగడు’ సినిమాకు సంబంధించి టాక్ ఎలా ఉన్నా తొలి మూడు రోజులు ఈ సినిమా రికార్డులను షేక్ చేయడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు.   

మరింత సమాచారం తెలుసుకోండి: