తన మొట్టమొదటి సినిమా ప్రారంభం కాకుండానే నాగార్జున చిన్న కొడుకు అఖిల్ మహేష్ కు రిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కార్పొరేట్ కంపెనీల రారాజుగా వెలుగొందుతున్న మహేష్ బాబు సామ్రాజ్య సింహాసనానికి అఖిల్ తన తొలి సినిమా విడుదల కాకుండానే షేక్ చేయబోతున్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు అఖిల్ ప్రముఖ టైటాన్ వాచ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా నియమింప బడినట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ టాప్ సెలెబ్రెటీలు అమీర్ ఖాన్, ఫరాన్ అక్తర్, కత్రీనా కైఫ్ లాంటి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన టైటాన్ వాచ్ కంపెనీకి తన మొదటి సినిమా కూడ విడుదల కాని ఒక సెలెబ్రెటీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం ఒక రికార్డు. ఇప్పటికే ఈ వాచ్ కంపెనీ వాచీలను చేతికి పెట్టుకుని అఖిల్ నటించిన యాడ్ ఫిలిం షూటింగ్ పూర్తి అయింది అనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే బుల్లితెర పై అఖిల్ నటించిన టైటాన్ వాచ్ కంపెనీ యాడ్ ప్రారంభం అవుతుంది అని అంటున్నారు. వెండితెర పై ఇంకా పూర్తి స్థాయిలో కనిపించని అఖిల్ బుల్లితెర హంగామా చాలామందిని ఆకర్షించే అవకాశం ఉంది.  మొన్న జరిగిన అక్కినేని జయంతిలో అఖిల్ మాట్లాడుతూ తాను బ్లాక్ బస్టర్ ని ఇచ్చే సినిమాతో రాబోతున్నాను అని చెప్పడం బట్టి టాలీవుడ్ లో అఖిల్ టాప్ క్రేజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: