కోలీవుడ్ బ్యూటీ నయనతార అభిమానుల పేరు చెపితే భయపడి పోతోంది అనే వార్తలు వస్తున్నాయి. తమిళ తంబీలకు సినిమాతారల పట్ల విపరీతమైన భక్తి. వారిని అభిమానిoచడమే కాకుండా వారిని దేవతలులా పూజిస్తూ గిడులు కూడా కట్టేస్తూ ఉంటారు. గతంలో తమిళ నటి ఖుష్బూకి గుడి కట్టారు. ఆ తర్వాత సిమ్రాన్‌కి కట్టాలనుకున్నారనే వార్త కూడా వచ్చింది. ఆ తరువాత తమిళనాడు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న బ్యూటీ నమిత కోసం ఆమె అభిమానులు గుడి కట్టారనే వార్త అప్పట్లో కోలీవుడ్ లో సంచలన వార్తగా మారింది. ఇప్పుడు ఈ లిస్టులోకి లేటెస్ట్ గా నయనతార వచ్చి చేరింది అనే వార్తలు కోలీవుడ్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మీడియా రాస్తున్న వార్తల ప్రకారం కొంతమంది నయనతార వీరాభిమానులు ఆమెను కలిసి తమిళనాడులో ఆమె పేరిట గుడి కట్టడానికి అనుమతి ఇవ్వమని కోరారట. అంతేకాదు ఈ ప్రయత్నానికి నయనతార నుండి ఎటువంటి ఆర్ధిక సహాయం అక్కరలేదని కూడా స్పష్టం చేసారట. అయితే అనుకోని ఈ విపరీతమైన కోరికకు నయన్ షాక్ అయి తాను కూడా మామూలు వ్యక్తినే అని అంటూ తన పై ఇటువంటి ప్రయత్నాలు చేయవద్దని తన అభిమానులకు గట్టిగ క్లాసు పీకిందని కోలీవుడ్ మీడియా న్యూస్ రాస్తోంది. నయన్ ఈ మాత్రం ఆలోచించినందుకు అభినందించాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: