బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. అయితే అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఈ రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. పంజాబ్ లోని కపూర్తలా ప్రాంతంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఒక స్టోర్ ప్రారంభోత్సవానికి జలంధర్ నుంచి అమృతసర్ వెళ్తున్నప్పుడు శిల్పాశెట్టి ప్రయాణిస్తున్న కారును ధిల్లవాన్ టోల్ ప్లజా సమీపంలో మరో కారు ఢీకొంది. దీంతో ఆమె అంగరక్షకులు కారు డ్రైవర్ తో గొడవ పడ్డారు. ఈలోపు మరో కారులో శిల్పాశెట్టి అక్కడినుంచి వెళ్లిపోయింది. రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్న శిల్పాశెట్టి ఇటు సినీరంగంతో పాటు అటు వ్యాపార రంగంలో కూడా బాగా నిలదొక్కుకున్న విషయం తెలిసిందే. 2010 తరువాత తను ఒక్క మూవీలోనూ నటించలేదు. కేవలం 2014లో వచ్చిన ఒకే ఒక్క మూవీలో గెస్ట్ ఎప్పీరియన్స్ గా శిల్పాశెట్టి కనిపించింది. ఇదిలాఉంటే శిల్పాశెట్టికి జరిగిన రోడ్డుప్రమాధం పై కుటుంబ సభ్యులు కొంత కంగారు పడ్డారు. తీరా తనకి ఎటువంటి గాయాలు కాలేదని తెలుసుకొని అందరూ రిలాక్స్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: