టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా శతాబ్ధాల చరిత్రని కలిగి ఉన్న హీరో నాగార్జున. అయితే గత కొంత కాలంగా నాగార్జున నటిస్తున్న చిత్రాలు, ఎక్కువుగా కొత్త దర్శకులతోనే ఉంటాయి. తను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత దర్శకులని పరిచయం చేయడం, వాటిలో కొన్ని మూవీలో బాక్సాపీస్ వద్ద హిట్ కావడం, మరొకొన్ని డిజాస్టర్ కావడం వంటివి జరుగుతున్నాయి. మొత్తానికి తను నటించిన తాజా చిత్రం మనం మూవీ, టాలీవుడ్ బాక్సాపీస్ ని షేక్ చేయడంతో నాగార్జున ఫిల్మ్ కెరీర్ ఇప్పుడు ఫాంలోకి వచ్చింది. ఇదిలా ఉంటే నాగార్జున ఇప్పుడు మరోసారి కొత్త దర్శకులకి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు. తను తీయబోతున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కి, కొత్త దర్శకులు అయితేనే బాగుంటుదని నిర్ణయించుకున్నాడంట. అందుకోసం తనకు తెలిసిన, అలాగే తన వద్దకు వచ్చిన కొత్త దర్శకులకి నాగార్జున ఆఫర్ ఇస్తున్నాడు. కథ బాగుంటే కాదనకుండా అవకాశం ఇవ్వడానికి నాగార్జున సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో కొత్త దర్శకులు చెప్పిన చాలా కథలని విన్నట్టుగా టాలీవుడ్ లో కథనాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తన వద్దకు వస్తున్న యంగ్ డైరక్టర్లు అంతా నాగ చైతన్య సినిమా అడుగుతున్నారట. దీంతో నాగార్జునకి వింత పరిస్థితి ఎదురవుతుంది. ఏదేమైనా తన అప్ కమింగ్ మూవీ ప్రాజెక్ట్ కి మెగాస్టార్ పరిచయం చేసిన కళ్యాణ్ అనే కొత్త దర్శకుడు సెట్ అయ్యాడు. అలాగే మరో 3 ప్రాజెక్టులు ఫైనలైజ్ అవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి. మొత్తంగా నాగార్జున మరో రెండు సంవత్సరాలలో కనీసం నలుగురు కొత్త డైరెక్టర్స్ ని ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం ఉందని అంటున్నారు. భాయ్, గ్రీకువీరుడు లాంటి ఫ్లాప్ సినిమాలు చూసిన తరువాత కథల విషయంలో నాగార్జున చాలా జాగ్రత్త పడుతున్నట్టుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: