పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ విషయంలో తాజగా తీవ్రమైన ఉద్వేగానికి గురైయ్యారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కి దగ్గరగా ఉండే సన్నిహితులు బయటకు తెలియజేసినట్టుగా టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. మేటర్ లో కి వెళితే, విశాఖలో తుఫాన్ భాదితులను పరామర్శించిన ప్రముఖ సినీ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ నుండి ఖమ్మం బయలుదేరారు అనే విషయం తెలిసింది. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న శ్రీజ అనే 12 ఏళ్ళ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. మరికొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతుందని వైద్యులు చెప్పారు. తన చివరి కోరికగా అభిమాన హీరో పవన్‌ కల్యాణ్‌ ను చూడాలని ఉందని శ్రీజ చెప్పింది. మీడియా ద్వార ఈ విషయం ను తెలుసుకున్న పవన్ కళ్యాణ్, శ్రీజ పరిస్థితిని తెలుసుకొని, కన్నీళ్ళు పెట్టుకున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఏదో సరదాగా వెళ్ళి చూద్ధాం? అనే భావనతో కాకుండా, తనుకు సరైన వైధ్యాన్ని అందించలేక పోయాననే భావనతోనూ, వీలైతే హెల్త్ పరంగా తను ఎటువంటి సహాయం అందించగలనో వంటి విషయాలను కూడ అడిగి తెలుసుకోవడం జరిగిందట. పాల్వంచలో శ్రీజను పవన్ కలుస్తాడు. మీడియా వారిని అనుమతించకుడదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు కూడ వార్తలు వస్తున్నాయి. రోజులు లెక్కిస్తున్న ఆ చిన్నారి చివరి కోరికను పవన్ నెరవేరుస్తున్నారు. గతంలో ఒకసారి వరంగల్ యాసిడ్ దాడిలో గాయపడిన స్వప్నిక చివరి కోరిక తీర్చడం కోసం పవన్ వెళ్ళిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: