ఉత్తరాంధ్ర ప్రజలను ముఖ్యంగా విశాఖపట్నం వాసులను తీవ్రంగా దెబ్బ తీసిన ‘హుదుద్’ తుఫాన్ షాక్ నుండి ఇప్పుడిప్పుడే జనం కోలుకుంటున్నారు. ఈ ప్రాంతాలలోని ప్రజలకు జరిగిన నష్టం నుండి ఆదుకోవడానికి మన టాలీవుడ్ లోని పవన్ కళ్యాణ్ నుండి సంపూ బాబు వరకు ఎందరో కోట్లాది విరాళాలను సహాయ కార్యక్రమాల కోసం ప్రకటించి ప్రజలకు అండగా తాము కూడా ఉన్నాము అంటూ సంకేతాలు ఇచ్చారు.  కొందరు టాలీవుడ్ సెలెబ్రెటీలు అయితే హుదూద్ బాధితుల కోసం కొన్ని ప్రత్యేక స్టేజ్ షోలు నిర్వహించి కోట్లు సహాయం చేద్దాం అనుకుంటున్నారు. అయితే ఈ లిస్టులో లేటెస్ట్ గా చేరిన ప్రముఖ గాయని నటి స్మిత ‘హాయ్ రబ్బాఫేం’ ప్రకటించిన 7 లక్షల విరాళం అందర్నీ ఆశ్చర్యపరచడమే కాకుండా వినూత్నంగా స్మిత బాధితుల కోసం పంచి పెట్టిన వేలల్లో పులిహోర పొట్లాలతో పాటు 1000 కిలోల పైగా ఆవకాయ పచ్చడి కూడా ఉండటం అందర్నీ ఆశ్చర్య పరచడమే కాకుండా పాప్ సింగర్ గా పేరున్న స్మితకు ఇంత సామాజిక చైతన్యం ఉందా? అని అనిపించేడట్లు చేసింది.  అంతేకాదు వందల సంఖ్యలో వాటర్ క్యాన్స్ కూడా పంపి తన ఔదార్యం చాటుకుంది స్మిత. ఆ మధ్య శివ తత్వం పై ఒక డివోషనల్ ఆల్బమ్ చేసిన స్మిత గత ఎన్నికలలో మోడీ పై ‘నమో మోడీ’ అనే ఆల్బమ్ కూడా రూపొందించిన సంగతి తెల్సిందే. తుఫాన్ బాదితులకు స్మిత చేసిన 1000 కేజీల ఆవకాయ పంపిణీ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: