టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కంటూ ఓ స్టార్ డం ని క్రియేట్ చేసుకున్న హీరో మహేష్ బాబు. ఇప్పటి వరకూ టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా మహేష్ బాబు ఫిల్మ్ కెరీర్ ని కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే మహేష్ బాబు నటిస్తున్న మూవీలలో ఇప్పటి వరకూ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా శ్రుతిహాసన్ రికార్డ్ క్రియేట్ చేయబోతుంది. ఇదంతా మహేష్ బాబు నటించబోతున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్ లో జరగుతుంది. డిమాండును బట్టి మన కథానాయికలు తమ పారితోషికాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూపోతున్నారు. అందుకే, వీరికి ఓ రేటంటూ ఫిక్సెడ్ గా లేదు. ఇదే కోవలో ఇప్పుడు శృతి హాసన్ తన తాజా చిత్రానికి 1.25 కోట్ల రూయాల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే సినిమాలో శృతి కథానాయికగా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రానికి గాను అమ్మడు ఈ రేటు చార్జ్ చేస్తోందట. శ్రుతిహాసన్ ఇప్పటి వరకూ కోటి రూపాయల వరకూ తన రెమ్యునరేషన్ తీసుకుంది కాని, ఏకంగా కోటి ఇరవై లక్షల రూపాయల వరకూ ఏనాడు రీచ్ అవ్వలేదు. ఈ మధ్య కాలంలో సమంత, తమన్న వంటి హీరోయిన్స్ కోటిన్నర, రెండు కోట్ల రూపాయల వరకూ కూడ వారి రెమ్యునరేషన్ ని తీసుకున్నారు. వారికి ఏ మాత్రం తీసిపోని బ్యూటీ శ్రుతిహాసన్ కావడంతో తను కూడ రెమ్యునరేషన్ విషయంలో దూకుడు పెంచేంది. రేట్లని అమాంతం పెంచేసి, ఇప్పుడు ఏకంగా నిర్మాతలని డిమాండ్ చేసే స్థాయికి వెళ్ళింది. దాంతో ఇంతవరకు శృతి ఒక సినిమాకు తీసుకున్న అత్యధిక మొత్తం, మహేష్ బాబు మూవీతోనే అవుతుంది. శ్రుతిహాసన్ రెమ్యునరేషన్ వివరాలను తెలుసుకున్న మహేష్ బాబు సైతం అకవాక్కయినట్టుగా టాలీవుడ్ లో కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ ఈ నెలాఖరు నుంచి హైదరాబాదులో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: