దీపావళికి విడుదలై కోలీవుడ్ లో కలెక్షన్స్ సంచలనాలు సృష్టిస్తున్న విజయ్ ‘కత్తి’ సినిమా పై ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ దృష్టి మాత్రమే పడింది అని అనుకున్నారు అంతా. అయితే లేటెస్ట్ వార్తల ప్రకారం ‘కత్తి’ సినిమాను చిరంజీవి 150వ సినిమాగా మారిస్తే బాగుంటుంది అనే సూచనలు ఇప్పటికే చాలామంది చిరంజీవికి సూచిస్తున్నట్లు టాక్.  అదేవిధంగా అటు చిరంజీవి కాని లేదా ఇటు పవన్ కాని ఈ సినిమాలో నటించకుంటే మెగా వారసుడు రామ్ చరణ్ కు అయినా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా మారుతుందని సూచనలు మెగా ఫ్యామిలీకి సన్నిహితులు ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు మెగా కుటుంబానికి చెందిన ఈ ముగ్గురు హీరోలలో ఎవరో ఒకరు ఈ సినిమా రీమేక్ లో నటించడం ఖాయం అంటూ వార్తల హడావిడి జోరందుకుంది.  ఈ సినిమా రీమేక్ పై ఇంత రచ్చ జరగడానికి గల కారణం ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ గతం లో చిరంజీవితో ‘ఠాగూర్’ లాంటి సూపర్ హిట్ తీసిన నిర్మాత మధు దగ్గర ఉండటం వల్లనే ఈ వార్తలు వస్తున్నాయి అని అంటున్నారు. అసలు ‘కత్తి’ రీమేక్ ఆలోచన కూడా మెగా కుటుంబంలో కలగడానికి ఈ నిర్మాత కారణం అని టాక్ కుడా ఉంది .  ఈ కారణం వల్లే ఈ వారం 31 న రిలీజ్ కు ప్లాన్ చేసిన ‘కత్తి’ డబ్బింగ్ సినిమా విడుదల మెగా హీరోల నిర్ణయం తెలుసుకునేందుకు మరొక వారం విడుదల ఆపు చేసారు అనే వార్తలు కూడా ఉన్నాయి. మూడు ఆప్షన్స్ తో ‘ఠాగూర్’ మధు రెడీగా ఉన్నాడని అంటున్నారు. చిరంజీవి-మురగదాస్, పవన్-వినాయక్, రామ్ చరణ్-బాబీ (పవర్) డైరెక్టర్ ల ఆప్క్షన్స్ మధ్య ఎవరో ఒక మెగా హీరోను ఈ ‘కత్తి’ రీమేక్ కు ఒప్పించాలని జరుగుతున్న ప్రయత్నాల మధ్య ‘కత్తి’ రీమేక్ మెగా రాజకీయం జరుగుతోంది అనే వార్తలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి..   

మరింత సమాచారం తెలుసుకోండి: