గత కొంత కాలంగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల పై వివాదాలు అల్లుకుంటున్నాయి. ముఖ్యంగా తను తెరకెక్కించే చిత్రాలలోని కథలు ఎంటర్టైన్మెంట్ గా ఉన్నప్పటికీ, కథలోని సన్నివేశాలు మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల మధ్య ఉంటాయన్న భావన చాలా మందిలోకి వెళుతుంది. నిజానికి శ్రీనువైట్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర సక్సెస్ లని ఇచ్చినప్పటికీ, తను తెరకెక్కిస్తున్న సినిమాలు రిలీజ్ తరువాత తన టీం లోని మెంబర్స్ బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది.
ఈ కారణాలతో శ్రీనువైట్ల పై బయటకు నెగిటివ్ పబ్లిసిటి జరగుతుంది. తాజాగా ఆగడు మూవీకి సంబంధించిన విషయంలో ఇదే జరిగింది. యాక్టర్ ప్రకాష్ రాజ్ తో శ్రీనువైట్ల మధ్య జరిగిన వాగ్విధాలు ఇండస్ట్రీ విలువలని దిగదార్చాయి. అలాగే కోన వెంకట్, శ్రీనువైట్ల మధ్య జరిగిన రచ్ఛ కూడ శ్రీనువైట్ల పై నెగిటివ్ పబ్లిసిటిని క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే గోవిందుడు అందరివాడేలే తరవాత శ్రీనువైట్ల తో సినిమా చేద్దామనుకొన్నాడు రామ్ చరణ్. ఆగడు సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకొన్నాడు. వైట్లతో సినిమా ఉంది కదా అని మరొకరికి కమిట్ కాలేదు.
మరో వైపు శ్రీనువైట్ల కూడా ఖాళీ అయిపోయాడు. దాంతో రామ్ చరణ్ చేయబోయే సినిమా డైలమాలో పడింది. ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీపై కథా చర్ఛలు జరుగుతున్నాయి. ఆగిపోయిందనుకొన్న శ్రీనువైట్ల సినిమా మళ్లీ పట్టాలెక్కించడానికి చరణ్ సిద్ధంగా ఉన్నాడు. దాంతో శ్రీనువైట్ల, చరణ్ సినిమా ఎట్టకేలకు ఓకే అయ్యిందని టాలీవుడ్ టాక్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: