నిన్నటి వరకు ప్రేమ జంటగా మీడియాకు కను విందు చేసిన రానా, త్రిషల స్నేహం విడి పోవడానికి ఒక హీరోయిన్ కారణం అంటూ మరొక కొత్తరకం వార్తలు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. రానా త్రిషల మధ్య స్నేహానికి కన్నడ బ్యూటీ రాగిణి ద్వివేది చిచ్చు పెట్టింది అనే వార్తలు వస్తున్నాయి.  రానాతో రాగిణి కలిసి తీయించుకున్న ఫోటోలు వెబ్ మీడియాలో హడావిడి చేయడంతో త్రిషకు విపరీతమైన కోపం వచ్చి రానాకు శాస్వితంగా బైబై చెప్పింది అని రూమర్. అయితే ఈ వార్తల పై రాగిణి మీడియా పై మండి పడిపోతోంది. ఎదో ఒక ఫంక్షన్ లో పాల్గొని రానా తో ఫొటోలలో కనిపిస్తే ఇంత రచ్చరచ్చ చేస్తారా అంటూ మీడియా పై దాడి చేస్తోంది రాగిణి.  అసలు రానాకు రాగిణికి పరిచయం ఏర్పడడానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి’ సినిమా ఏ కారణం అనే ప్రచారం కూడా ఉంది. వీరిద్దరి మధ్య స్నేహం ఈ సినిమా పెంచింది అని అంటారు. త్రిషతో తన స్నేహం బ్రేకప్ అయిన విషయం పై వస్తున్న వార్తల పై రానా కూడా తీవ్రంగా స్పందించాడు అని తెలుస్తోంది.  కేవలం ఒక ఫోటోను పెట్టుకుని ఇటువంటి గాలి వార్తలు వ్రాస్తే ఎలా అంటూ రానా కూడా మీడియా పై కోపంగా ఉన్నాడని టాక్. ఏది ఏమైనా ఎవ్వరూ విడదీయలేని రానా, త్రిషల స్నేహాన్ని రాగిణి విడదీసి రికార్డు క్రియేట్ చేసిందనే అనుకోవాలి. మరి ఇక ముందు ముందు ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో మరి..  

మరింత సమాచారం తెలుసుకోండి: