హుదూద్ తుఫాన్ వల్ల నష్టపోయిన వారికి చేయూతనిచ్చే ఉద్దేశ్యంతో టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఏర్పాటు చేసిన ‘మేము సైతం’ కార్యక్రమానికి సంబంధించి ఒక ఆ శక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ నెల 30వ తారీఖున జరగ బోతున్న ఈ కార్యక్రమానికి ఒకరోజు ముందు అంటే నవంబర్ 29 తారీఖున హైదరాబాద్ లో ప్రసిద్ది గాంచిన జెఅర్ సి కన్వెంక్షన్ సెంటర్ లో ‘డైన్ విత్ స్టార్స్’ పేరుతో నిర్వహింప బడుతున్న స్టార్ డిన్నర్ కార్యక్రమానికి టాలీవుడ్ ఎంపరర్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా రావడానికి అంగీకరించాడు అనే వార్తలు వస్తున్నాయి.  అయితే ఈ డిన్నర్ కు వచ్చి పవన్ ను కలిసి మాట్లాడాలి అంటే అక్షరాల ఓల లక్ష రూపాయలు ‘మేము సైతం’ కార్యక్రమానికి విరాళంగా ఇవ్వాలి. అయితే ఈ విరాళం ఇచ్చిన వారందరూ పవన్ పాల్గొనబోయే స్టార్ డిన్నర్ కు రావడమే కాకుండా పవన్ తో ఫోటోలు, పవన్ తో మాట్లాడే అవకాశం కల్పించ బడుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ స్టార్ డిన్నర్ కార్యక్రమంలో చాలామంది ఫిలిం సెలెబ్రెటీలు పాల్గొంటున్నా కేవలం పవన్ కు ఉన్న క్రేజ్ రీత్యా ఈ స్టార్ డిన్నర్ కార్యక్రమానికి ఎక్కువ మంది రావడంతో తద్వారా ఒక భారీ మొత్తాన్ని సేకరించి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వాలని నిర్వాహకుల ప్లాన్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.  పవన్ కళ్యాణ్ క్రేజ్ విపరీతంగా యూత్ లోనే కాకుండా పెద్దపెద్ద కార్పోరేట్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులలో కూడా ఉండటంతో ఆ క్రేజ్ ను ‘మేము సైతం’ కార్యక్రమానికి విరాళాలుగా సేకరించడానికి ఈ కార్యక్రమాన్ని టాలీవుడ్ ప్రముఖులు నిర్వహిస్తున్న ఈ ప్రయత్నానికి ఎంత వరకు స్పందన వస్తుంది అన్న విషయం పై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: