పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు సాధారణ స్టార్ డం ని కలిగిన వ్యక్తి కాదు. పవన్ మూవీ రిలీజ్ అంటే జరిగే హంగామా కూడ మామూలుగా ఉండదూ. అలాగే పవన్ మూవీకి మొదటి రోజు కలెక్షన్స్ సైతం రికార్డ్స్ ని మించి ఉంటుంది. అలాంటి పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ గోపాల గోపాల మూవీ పై ఫిల్మ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందులోనూ ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ నటించడంతో ఈ మూవీకి అతి పెద్ద మల్టీస్టారర్ గా పేరు వచ్చింది. దీంతో ఈ మూవీకి పోటీగా మరే మూవీని రిలీజ్ చేయటానికి ఎవ్వరూ సాహసించటంలేదు. అయితే ఇక్కడే ఓ సమస్య వచ్చింది. మెగా కుటుంబం నుంచి మరో హీరోగా పరిచయం అవుతున్న మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ముకుంద'. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పాట మినహా పూర్తయింది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయటానికి నిర్ణయించారు. ఈ నేపధ్యంలో బిజినెస్ మొదలైంది. అయితే బయ్యర్లు కొనటానికి భయపడుతున్నట్లు ట్రేడ్ లో టాక్స్ వినపడుతోంది. దానికి కారణ ప్రధానంగా పవన్ కళ్యాణ్ అని తెలుస్తోంది. పవన్ చిత్రం గోపాల గోపాల ని సైతం సంక్రాంతికే విడుదల చేయనుండటంతో ఆ ఎఫెక్టు తమ చిత్రం కలెక్షన్స్ పై ఖచ్చితంగా పడుతుందని భావిస్తున్నారు. దీంతో నాగాబాబు తనయుడు వరుణ్ తేజ్ మూవీ రిలీజ్ ఇప్పుడు ప్రశ్నార్ధంగా మారింది. పవన్ మూవీ ని తట్టుకొని సంక్రాంతికి, వరుణ్ తేజ్ తన ముకుంద మూవీని రిలీజ్ చేయగలడా? అంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి గోపాల గోపాల, ముకుంద మూవీలలో ఏదో ఒకటి రాజీ పడటం ఖాయం అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: