ప్రతి విషయంలోనూ విభిన్నంగా ఉండే మంచు వారి కుటుంబం హూదూద్ బాధితుల సహాయార్ధం ఏర్పాటుచేసిన ‘మేము సైతం కార్యక్రమంలో మంచు ఫ్యామిలీ అంతా కలిసి కబడ్డీ మ్యాచ్ ఆడబోతోంది. తెలుగు గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ ఎంతోమంది ఇష్టంగా ఆడే ఈ ఆటను మంచు కుటుంబంలోని మోహన్ బాబు, విష్ణు, మనోజ్, లక్ష్మీ నాలుగు జట్లుగా ఏర్పడి ఒకరి పై ఒకరు పోటీగా కబడ్డీ ఆడుతూ తమ సత్తా చూపెట్ట బోతున్నారు.  ఈ మ్యాచ్ ‘మేము సైతం’ కార్యక్రమం ఈనెల 30 తారీఖున జరగబోతోంది. ఈ టీమ్ లలో మంచు ఫ్యామిలీ కుటుంబ సభ్యులే కాకుండా అనేక మంది హీరోలు, హీరోయిన్స్ కూడా ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే అనేక కార్యక్రమాలతో ప్రాచుర్యం పొందుతున్న ‘మేము సైతం’ కార్యక్రమానికి ఈ మంచు కుటుంబ కబాడ్డీ మ్యాచ్ హైలెట్ కాబోతోంది.  ఈ వార్తలు ఇలా ఉండగా ఈ కార్యక్రమాలను చూసేందుకు ఒక్కో టికెట్ ఖరీదు 15000 వేల రూపాయలుగా నిర్ణయించారు. ఈ టికెట్లను బుక్ మై షో ద్వారా పొంద వచ్చని తెలియచేస్తున్నారు. ఈ టికెట్స్ ను కొన్నవారందరు ఆ రోజు నిర్వహించబడే థంబోలా గేమ్‌లో పాల్గొనే అవకాశం దక్కించు కోవడమే కాకుండా మొదటి బహుమతిగా మెర్జిడెజ్ బెంజ్ కారు గెలుచుకునే అవకాశం ఉంది.  ఒక వైపు స్టార్స్ క్రికెట్ మ్యాచ్ మరో వైపు మంచు ఫ్యామిలీ కబడ్డీ మ్యాచ్ ఆపై 12 గంటల తారల వినోద కార్యక్రమాలతో ‘మేము సైతం’ హోరెత్తి పోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: