టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డిసిప్లెన్ లేకపోతే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అలాగే ఓ స్టార్ హీరోకి కూడ డిసిప్లెన్ లేకపోతే అంతే ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటిదే డిసిప్లెన్ ని కోల్పోయిన హీరోని, భార్య ఓ క్రమపద్దతిలో ముందుకు తీసుకుపోతుంది. మేటర్ లోకి వెళితే, గతంలో మహేష్ బాబుని సినీ ఇండస్ట్రీలోనివారు కలవాలంటే పెద్దగా కండిషన్స్ ఉండవు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. గతంలో కుదిరినట్టుగా ఇప్పుడు నిర్మాతలు మహేష్ బాబును ఎప్పుడు పడితే అప్పుడు అపాయింట్ మెంట్ లేకుండా కలవడం అంత సింపుల్ విషయం కాదు. ఎందుకంటే, ఇప్పుడు మహేష్ ఇంటి వద్ద రూల్స్ అన్నీ మారిపోయాయట. తాజాగా ఓ నిర్మాత మహేష్ ని కలవాలని ఇంటికి వెళితే, సెక్యూరిటీ గార్డ్స్ పర్మిషన్ ఇవ్వలేదంట. అంతే కాకుండా మహేష్ చేత కాల్ చేయించండి, నమ్రత మేడంతో ఫోన్ చేయించండి.., అంటూ ఆ నిర్మాతని సెక్యూరిటీ తెగ ఇబ్బంది పెట్టినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఆ నిర్మాత మహేష్ వద్ద నుండి పర్మిషన్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. ఈ మొత్తం వ్యవహారంలో తనకి తెలిసొచ్చిన విషయం ఏమిటంటే గతంలోలాగా మహేష్ ని ఇప్పడు కలవడం సాధ్యపడదు. ముఖ్యంగా కథల కోసం, కాల్షీట్స్ కోసం మహేష్ ని సంప్రదించాలంటే ఇప్పుడు చాలా కష్టమైన పని అంటున్నాడు. ఇదంతా ఎందుకంటే 'ఆగడు' చిత్రం అపజయం పాలవడంతో మహేష్ భార్య నమ్రత చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట. తన అనుమతి లేనిదే ఎవర్నీ ఇంట్లోకి పంపించవద్దని ఆమె సెక్యూరిటీకి కచ్చితమైన ఆదేశాలు జారీ చేసిందని అంటున్నారు. అలాగే, షూటింగులకు, ఇంటికి వచ్చి డిస్టర్బ్ చేసే 'భజన'మండలిని కూడా మహేష్ ఇప్పుడు దూరంగా పెడుతున్నాడట. ఇదంతా నమ్రత ఇచ్చిన సలహా కారణంగానే జరిగిందని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: