సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అంటే అందరకి రెస్పెట్ ఉంటుంది. మరి ఐటెం బ్యూటీ అంటే మాత్రం అంద మర్యాధ ఉండదు. ఎందుకంటే వీరిద్దరూ తీసుకునే రెమ్యునరేషన్ లో చాలా తేడాలుంటాయి. అంతే కాకుండా చిత్ర యూనిట్ ట్రీట్ చేసే విధానంలోనూ చాలా వేరియేషన్ ఉంటుంది. అయితే ఇదంతా కేవలం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే చూస్తుంటాం. ఇదే విషయాన్ని బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసుకుంటే చాలా తేడా ఉంటుంది. అక్కడ ఐటెం బ్యూటీలను, స్టార్ హీరోయిన్స్ కంటే ఎక్కువుగా చూసుకుంటారు. ఎందుకంటే అక్కడి ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రొడక్షన్ వాల్యూస్ ఎంటో బాగా తెలుసు కాబట్టి. అయితే మేటర్ లోకి వెళితే, సినీ ఇండస్ట్రీలో కథనాయికలుగా రాణించిన, రాణిస్తున్న అక్కాచెల్లెళ్లు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం ఇదే కోవలోకి హీరోయిన్ సంజన చెల్లి నిక్కీ కూడా చేరింది. ఇప్పటికే దక్షిణాదిలో మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో నటించిన ఈ బ్యూటీ త్వరలో టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. హీరో ఆది పినిశెట్టి నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'మలుపు'లో సంజన చెల్లి నిక్కీ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే సంజనకి కాంట్రవర్సీ హీరోయిన్ గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరు ఉంది. తను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు, దర్శకులు, హీరోల ఆధిపత్యానికి తలవంచకుండా ఎదురు చెప్పడమే కాకుండా, బహిరంగా వారి బాగోతోలను వేలు ఎత్తి చూపింది. దీంతో సంజన జోలికి వెళ్ళాలంటే చాలా మంది ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ చెల్లి నిక్కీ మీద కూడ కొద్దిగా పడింది. తను టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ అవకాశాల కోసం చూస్తుంటే, చాలా మంది సంజన చెల్లివా?! అంటూ ఏ విషయం తేల్చకుండా నిర్ణయాలను పెండింగ్ లో పెడుతున్నారంట. కొంత మంది అయితే అక్కలాగే ఎదురుతిరుగుతుందేమో అని ముందునుండే నిక్కీని చూసి భయపడుతున్నారు. మొత్తంగా నిక్కీ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ విధమైన ఆఫర్స్ ని చేజిక్కించుకుంటుందో తెలియాలంటే మరి కొంత సమయం వెయిట్ చెయ్యాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: