నిన్న తన కుమారుడు ఆది వివహం రంగ రంగ వైభవంగా జరిగి 24 గంటలు కూడా గడవ కుండానే ప్రముఖ నటుడు సాయి కుమార్ ఇంట్లో విషాదం చోటు చేసుకోవడం టాలీవుడ్ పరిశ్రమను షాక్ కు గురిచేసింది. సాయి కుమార్ తండ్రి, ఆది తాత అయిన ప్రముఖ నటుడు పి.జె.శర్మ ఈరోజు ఉదయం కన్నుమూసారు అని వార్తలు వస్తున్నాయి. ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. ఈ వార్త విన్న చాలామందికి షాక్ కు గురి కావడమే కాకుండా పెళ్లి వేడుకలు పూర్తిగా ముగియకుండానే ఈ ఘటన సాయి కుమార్ ఇంట్లో చోటు చేసుకోవడం అందర్నీ కలిచి వేస్తోంది. ప్రముఖ నటుడిగా పేరు గాంచిన పీ.జే శర్మదాదాపు 150 సినిమాలలో నటించడమే కాకుండా 500 పై చిలుకు సినిమాలకు ఆయన డబ్బింగ్ కూడా చెప్పారు.  ఈరోజు మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా ఆయన ఆది వివాహానికి కూడా హాజరు కాలేక పోయారు. విజయనగరం జిల్లా కల్లేపల్లికి చెందిన పిజె శర్మ తన స్వయం కృషితో తెలుగు సినిమా రంగానికి వచ్చి అనేక ఆటుపోట్లు ఎదుర్కుని తనకంటూ ఒక స్థాయిని ఏర్పరుచుకున్న మంచి నటుడు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరకుందాo..

మరింత సమాచారం తెలుసుకోండి: