పవన్ ‘గోపాల గోపాల’ తరువాత మాస్ మసాల సినిమా ‘గబ్బర్ సింగ్ 2’ సినిమాకు తన షూటింగ్ షెడ్యూల్ కూడా సిద్ధం చేసుకున్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే పవన్ దృష్టి గతవారం విడుదలైన అమీర్ ఖాన్ ‘పికె’ సినిమా పై పడింది అని ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి 4 రోజులకు 120 కోట్లు వసూలు చేసింది. అనే వార్తలు వస్తున్నాయి.  ఈమధ్యకాలంలో ఎటువంటి మాస్ ఎలిమెంట్స్ లేకుండా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బాలీవుడ్ సినిమాగా ఈసినిమా కొత్త రికార్డును క్రియేట్ చేస్తోంది. కామెడీతో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉండటంతో ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. అమీర్ ఖాన్ విభిన్నమైన పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్ అన్న విషయం విమర్శకుల దగ్గర నుంచి సామాన్య ప్రేక్షకుల వరకు అందరూ అంగీకరిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా రీమేక్ హక్కులను టాలీవుడ్ కు సంబంధించి సొంతం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ సన్నిహిత మిత్రుడు నిర్మాత శరత్ మారర్ సీరియస్ గా ఆలోచిస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని శరత్ మరార్ పవన్ దృష్టికి తీసుకు వెళ్ళాడని అయితే ఈ విషయం పై ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అని పవన్ శరత్ మరార్ తో అన్నట్లు టాక్.  వినపడుతున్న వార్తల ప్రకారం ‘గోపాల గోపాల’ సినిమా ఫలితం బట్టి పవన్ ఆలోచనలు ‘పికె’ విషయంలో ప్రభావితం చేస్తాయి అని అంటున్నారు. పవన్ ఈ సినిమా కూడా చేసి ప్రేక్షకులను మెప్పిస్తే మన టాలీవుడ్ సినిమా రంగంలో పెను మార్పులు వస్తాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: