ఈ సంవత్సరం విడుదలైన తన రెండు సినిమాలు అత్యంత ఘోరంగా పరాజయం చెందినా మహేష్ క్రేజ్ ఎక్కడా చెక్కుచెదరలేదు. అంతేకాదు అనేక ప్రముఖ సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలలో ఇప్పటికీ మహేష్ నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతున్నాడు. పరాజయాలను లెక్క చేయకుండా మహేష్ తో సినిమాలను చేయాలని ఆరాట పడుతున్న నిర్మాతల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది.  లేటెస్ట్ గా మహేష్ బాబుతో ఓ సినిమా చేసేందుకు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న పివిపి ఓ భారీ ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు సైతం పివిపి సంస్థతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.  ఈమధ్యనే శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కథకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమా వచ్చే సంవత్సరం ప్రారంభం కావడం ఖాయం అని అంటున్నారు. ఈ సినిమాకు బ్రహ్మోత్సవం అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారనే వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి వినపడుతున్న ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఈ సినిమాలో నటించినందుకు మహేష్ కు పివిపి నిర్మాణ సంస్థ 25 కోట్లు ఆఫర్ చేసింది అనే వార్తలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే మహేష్ బాబు రజినీకాంత్ తరువాత దక్షిణాది సినిమా రంగంలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా రికార్డు క్రియేట్ చేస్తాడు అన్నది నిజం..  

మరింత సమాచారం తెలుసుకోండి: