నందమూరి హీరోలలో ఎవరు గొప్ప? అని అంటే కచ్ఛితంగా చెప్పలేం. ఎందుకంటే ఒకరు గొప్ప అంటే మరొకరికి ఇబ్భంది. మొత్తంగా మాత్రం నందమూరి బాలక్రిష్ణ టాప్ పొజిషన్ లో ఉంటాడు అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే గత కొంత కాలంగా నందమూరి హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ కి, మిగతా నందమూరి హీరోలతో సరిగా సంబంధాలు లేవని ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇదంతా రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు మాత్రమే. కానీ ఇప్పుడు సీన్ మారింది. జూనియర్ ని కలుపుపోవటానికి నందమూరి హీరోలు ఒక్కటై పోయారు. తాజాగా జరిగిన పటాస్ ఆడియో వేడుక ఇందుకు తార్కాణంగా నిలుస్తుంది. ఇదిలా ఉంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టెంపర్’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం ‘టెంపర్’ ఆడియోను జనవరి 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఆడియో ఫంక్షన్ నందమూరి నటసింహం బాలక్రిష్ణ హాజరవుతున్నట్టుగా క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో జూనియర్ పై డైరెక్ట్ గానే కౌంటర్స్ విసిరిన బాలయ్య, ఇప్పుడు జూనియర్ ని అక్కున చేర్చుకోడం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు, అటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 13న సినిమాను విడుదల చేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: