సినిమా టాక్ తో సంబంధం లేకుండా విడుదలై వారం గడవకుండానే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లు వసూలు చేసి ‘ఐ’ సినిమా తన స్థాయిని చాటుకుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన శంకర్ ను విమర్శించిన వారు ఉన్నారు కాని ఈ సినిమాలో 3 షేడ్స్ ఉన్న పాత్రను పోషించిన విక్రమ్ ను మెచ్చుకోని వ్యక్తులు లేరంటే అతిశయోక్తి కాదు.

విమర్శకుల దగ్గర నుంచి సామాన్య స్థాయి ప్రేక్షకుల వరకు ఈ సినిమాలో నటించిన విక్రమ్ కు దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. విక్రమ్ కూడా తన శక్తివంచన లేకుండా ఈ సినిమా గురించి అన్ని భాషల మీడియా కార్యక్రమాలలో పాల్గొంటూ ఈ సినిమాకు వీలైనoత క్రేజ్ ను పెంచి కలక్షన్స్ రాబట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ మధ్యనే భాగ్యనగరంలో సందడి చేసిన విక్రమ్ ఇప్పుడు ముంబాయ్ లో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.

ఈ పరిస్థుతులు ఇలా ఉంటే విక్రమ్ ఫ్యామిలీ ఫోటో ఒకటి లేటెస్ట్ గా వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటోలో విక్రమ్ పిల్లలు ధృవ, అక్షితలు తమ తల్లి శైలజ బాలకృష్ణన్ కలిసి ఉన్నారు. ఈ ఫోటో ఎవరు వెబ్ మీడియాలో పెట్టారో తెలియక పోయినా ఈ ఫోటోలో విక్రమ్ కొడుకు ధృవ అచ్చు తన తండ్రి విక్రమ్ లాగే ఉన్నాడు అని కామెంట్స్ చేసుకుంటూ ఒకరికి ఒకరు ఈ ఫోటోను షేర్ చేసుకుంటున్నారు.

అంతేకాదు ఈ జూనియర్ విక్రమ్ తన తండ్రిని మించిన అందగాడు అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా విక్రమ్ వారసుడు వచ్చేస్తున్నాడు అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. దీనిని బట్టి చూస్తూ ఉంటే రానున్న రోజులలో విక్రమ్ వారసుడుగా ధృవ కోలీవుడ్ ను షేక్ చేసేనా ఆశ్చర్యం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: