నందమూరి కళ్యాణ్ రామ్ కలలు నిజం అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. తాను ఎన్నో ఆశలు పెట్టుకుని నటించి నిర్మించిన ‘పటాస్’ నిన్న మొదటి రోజు మొదటి ఆటనుండి హిట్ టాక్ తెచ్చుకోవడంతో మంచి జోష్ పై ఉన్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమా ఈ సంవత్సరం విడుదలైన సినిమాలలో రియల్ సూపర్ హిట్ అని టాక్ రావడం కళ్యాణ్ రామ్ ను ఆనందంలో ముంచెత్తి వేస్తోంది.

దాదాపు 10 సంవత్సరాల తరువాత కళ్యాణ్ రామ్ సక్సస్ ను చూస్తున్నాడు. ఈ వార్తలు ఇలా ఉండగా కళ్యాణ్ రామ్ తదుపరి సినిమా గురించి అప్పుడే వార్తల హడావిడి మొదలైంది. ఈ నందమూరి హీరో నటించబోయే తదుపరి సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తాడు అని టాక్. ప్రస్తుతం పూరి దర్శకత్వం వహిస్తున్న ‘టెంపర్’ విడుదల అయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది అని అంటున్నారు.

పూరి ‘టెంపర్’ తరువాత మహేష్ తో సినిమా చేయాలని ఆశ పడ్డా మహేష్ నుంచి సరైన స్పందన ఇప్పటి వరకు రాకపోవడంతో పూరి జగన్నాథ్ ఇలా కళ్యాణ్ రామ్ వైపు అనుకోని ట్విస్ట్ ఇచ్చాడు అని ఫిలింనగర్ టాక్. అంతేకాకుండా మెగా క్యాంప్ హీరో వరుణ్‌తేజ్‌తో సినిమా కూడా ఇప్పట్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో అన్ని విధాల కళ్యాణ్ రామ్ తో అడుగులు వేయడం మంచిది అన్న ఉద్దేశ్యంలో పూరి ప్రస్తుతం ఉన్నాడు అని అంటున్నారు.

ఈ వార్తలే నిజం అయితే ఒకే సంవత్సరంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరినీ డైరెక్ట్ చేసిన అరుదైన రికార్డు పూరి జగన్నాథ్ కొట్టేస్తాడు అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: