మెగా హీరో అల్లుఅర్జున్ ఈ మధ్య కాలంలో వరుస మూవీలను తీస్తూ, బాక్సాపీస్ వద్ద సత్తా చాటుతున్నాడు. తను సెలక్ట్ చేసుకుంటున్న కథలు, అలాగే సెలక్ట్ చేసుకుంటున్న దర్శకులు అంతా సక్సెస్ ఫుల్ రిజల్ట్స్ ని అందిస్తున్నాయి. దీంతో అల్లుఅర్జున్ తీసుకున్న నిర్ణయం, బాక్సాపీస్ ని షేక్ చేసే సినిమాగా ఉంటుందనే టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ దర్శకడు, ఈ మెగా హీరో వద్ద ఛాన్స్ దక్కించుకున్నాడు. వివరాల్లోకి వెళితే, అల్లు అర్జున్ - తివిక్రమ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ముగింపు దశకు చేరుకుంది. బన్నీఆ సినిమా తరువాత ఏ సినిమాలో నటిస్తాడు అన్న ఆశక్తి నెలకొనడంతో రకరకాల దర్శకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే గత సంవత్సరం 'నాగచైతన్య'తో ‘ఒక లైలా కోసం' సినిమాకు దర్శకత్వం వహించిన విజయ్ కుమార్ కొండ అల్లు అర్జున్‌ను కలిసి ఇటీవల ఓ స్టోరీ లైన్ చెప్పాడు అనే వార్తలు వస్తున్నాయి. ఈ స్టొరీ లైన్ బాగా నచ్చడంతో ఆ కథను డెవలప్ చేయమని దర్శకుడు విజయ్ కుమార్ ను బన్నీ కోరినట్లుగా ఫిలింనగర్ టాక్. అయితే తాజాగా విజయ్ కుమార్ కొండ కథకి అల్లుఅర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా క్లియర్ టాక్స్ తెలుస్తున్నాయి. గతంలో నితిన్ కు ‘గుండెజారి గల్లంతైయ్యిందే’ సినిమాను తీసి సూపర్ హిట్ కొట్టిన ఆ క్రేజ్ తోనే, విజయ్ కి తను ఈ అవకాశం ఇచ్చినట్టుగా అల్లుఅర్జున్ చెప్పుకొచ్చాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డిటైల్స్ త్వరలోనే బయటకు రానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: