సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న హీరో సిద్ధార్ధ్. అయితే గత కొంత కాలంగా సిద్ధార్ధ్ ఎటువంటి మూవీలు చేయకుండా, కేవలం కాంట్రవర్సీలకే పరిమితం అవుతున్నాడు. తను తెలుగులో నటించిన చివరి చిత్రం సమ్ ధింగ్ సమ్ ధింగ్. ఆ తరువాత నుండి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో సిద్ధార్ధ్ కి ఏదొక గొడవ జరుగుతూనే వస్తుంది.

ఇదిలా ఉంటే సిద్ధార్ధ్ కి తెలుగు నిర్మాత షాకింగ్ ఇచ్చారంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళితే, గత సంవత్సర కాలంగా సిద్ధార్ధ్, హన్సిక కాంబినేషన్ లో ఓ మూవీ షూటింగ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఏవోవో కారాణాల కారణంగా ఆ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇంకా సెట్స్ మీదకు రావడం లేదు. ఓ సమయంలో హీరోయిన్ సిద్ధంగా ఉంటే హీరో కాల్షీట్స్ సిద్ధంగా ఉండేవి కాదంట.

అలాగే కొన్ని సందర్భాల్లో, ఆ మూవీకి సంబంధించిన కథల్లో మార్పులు కావాలంటూ సిద్ధార్ధ్ చిత్ర యూనిట్ పై ఒత్తిడి తెచ్చేవాడంట. ఇలా మొత్తంగా మూవీకి సంబంధించిన వర్క్ కొద్దిగా కూడ ముందుకు వెళ్ళేది కాదు. దీంతో విసుగు చెందిన నిర్మాత హీరో సిద్ధార్ధ్ ని తన మూవీ నుండి తప్పించినట్టుగా చెప్పాడంట. దీంతో షాక్ అయిన హీరో, కారణం ఏంటో నిర్మాతని చెప్పమన్నాడు.

“మూవీకి చాలా నష్టం జరిగింది, నేను మూవీని నిర్మించలేను” అంటూ చెప్పడంతో సిద్ధార్ధ్ షాక్ అయ్యాడంట. ఎందుకంటే తెలుగు నుండి ఏ దర్శకుడు సిద్ధార్ధ్ తో మూవీకి ఆసక్తి చూపించడం లేదు. ఉన్న ఒక్క మూవీ కూడ పోవడంతో ఇక తెలుగులో తనకి ఇప్పట్లో మూవీలు లేనట్టే అని అంటున్నారు. ఒకానొక సందర్భంలో తను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీపై నోరు పారేసుకోవడంతో వచ్చిన ఇబ్బందులే వీటికి కారణం అని ఫిల్మ్ ఇండస్ట్రీలో బహిరంగంగానే టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: