టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మూవీని తెరకెక్కించేందుకు చాలా ఖర్చు అవుతుంది. ఎందుకంటే రీల్స్ కి పెట్టుకునే పెట్టుబడి, మూవీ బడ్జెట్ లో సగం ఉంటుందనేది నిర్మాతకి నిద్రలేకుండా చేస్తుంది. కాని, తరువాత వచ్చిన డిజిటల్ విప్లవం ద్వార, ఇప్పుడు మూవీ షూటింగ్ అంటే నిర్మాతకి తెగ హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ నో రీల్స్, ఓన్లీ డిజిటల్ ఫార్ములా.

ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యకి సంబంధించిన ఓ మూవీ షూటింగ్ ని పూర్తి చేసుకున్నాక, మళ్ళీ రీ షూటింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. దీంతో ఆ నిర్మాత భయపడినట్టు ఫిల్మ్ నగర్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే, సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాగచైతన్య మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ మూవీకి సంబంధించిన షూటంగ్ అంతూ పూర్తైన తరువాత, రషెస్ ని చూసిన నాగార్జున, నాగచైతన్యలు డైరెక్టర్ కి భారీ మార్పులు సూచించారు. దీంతో మూవీకి సంబంధించిన చాలా భాగాన్ని రీ షూట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

అయితే చాలా మంది పాత్రల కాల్షీట్స్ ఇందుకు అవసరం అయ్యాయి. దాదాపు మూవీ ఖర్చులో మరో 20 శాతం అదనంగా నిర్మాత భరించవలసి వచ్చింది. మొత్తానికి అన్ని రి-షూటింగ్స్ పూర్తి చేసుకున్న ఈ దోచెయ్ మూవీ, త్వరలోనే రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మార్చి 20న ఈ మూవీని రిలీజ్ చేసేందకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీలో నాగ చైతన్య సరసన, వన్ మూవీ హీరోయిన్ క్రితి సనన్ నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: