మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి గత కొంతకలంగ ఎన్నో విషయాలు చర్చించుకుంటున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సంవత్సరం సినిమా తప్పకుండా ప్రారంభం కానుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కథ ఓకే అయిందని, దర్శకుడిగా పూరి జగన్నాథ్ ఎంపికయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

పూరి అనుభవం, కథ ఎలాంటిదైనా వినోదాత్మకంగా సినిమాను తెరకెక్కించే ఆయన డైరెక్షన్, ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా ఉండే డైలాగ్స్ సినిమాకు ప్లస్సవుతాయని మెగా క్యాంపు భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో ఉండటం అభిమానులకు ఏ మాత్రం ఇష్టం లేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అభిమానులు కోరుకున్నట్లుగా చిరంజీవిలో మార్పు వచ్చినట్లు స్పష్టమవుతోంది.

150వ సినిమాకు సన్నద్ధం కావడంతో భాగంగా ఆయన పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ చిత్రానికి నిర్మాత రామ్ చరణ్ అనే విషయం తేలింది కానీ డైరెక్టర్‌ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. రేండేళ్ల క్రితం 150వ సినిమా చేస్తానని చిరంజీవి చెప్పినప్పటి నుండి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2014లోనే చిరంజీవి 150వ సినిమా పూర్తవుతుందని అనుకున్నారు.

చిరంజీవి ఇమేజ్ కి సరపడ కథ రాకపోవడంతో ఇంతకాలం సినిమా రీ ఎంట్రీకి జాప్యం జరిగింది. 2015 లో తప్పకుండా చిరంజీవి వెండితెరపై చూడాలని అందరి ఆకాంక్ష మరి చిరు అభిమానులను ఈ సంవత్సవరమైనా సంతోష పరుస్తాడా లేదా అనేది..

మరింత సమాచారం తెలుసుకోండి: