రెండు వరస విజయాలు తరువాత హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్న హీరో నిఖిల్ నటించిన ‘సూర్య వర్సెస్ సూర్య’ మార్చి 6న విడుద‌ల చేస్తున్నారు. ఆరోజు హోలీ కావడం నిఖిల్ కు సెంటిమెంట్ గా మారింది అంటున్నారు. దీనికి కారణం గత సంవత్సరం ఇదే రోజున నిఖిల్ మొట్టమొదటి హిట్ ‘స్వామిరారా’ విడుదలై విజయాన్ని అందుకుంది.

ఆ తరువాత ‘కార్తికేయ’ దీపావళికి వచ్చింది పండుగ సెంటిమెంట్ నిఖిల్ కు కలిసి వచ్చింది. ఇప్పుడు అదే పండుగ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ హోలీని టార్గెట్ చేస్తూ నిఖిల్ తన ‘సూర్య వర్సస్ సూర్య’ ను విడుదల చేస్తున్నాడు. ఒక చిన్న హీరో సినిమాకు 10 కోట్లు బిజినెస్ జరగడం టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది.

అయితే ఈ సినిమాకు పోటీగా ‘ఈగ’ చిత్రంతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రెడిట్ సంపాదించి ఆ తరువాత ‘ఉహలు గుసగసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ వంటి సక్సస్ ఫుల్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ‘తుంగభద్ర’ సినిమాను నిఖిల్ సినిమాతో పోటీగా విడుదల చేస్తూ ఉండటంతో నిఖిల్ టెన్షన్ పడుతున్నాడు అని టాక్.

సాయి కొర్రపాటి నిర్మాతగా సినిమాలు తీస్తున్నా అతడి వెనుక రాజమౌళి సపోర్ట్ ఉంది అన్న విషయం ఓపెన్ సీక్రెట్. సాయి కొర్రపాటి సినిమాలను రాజమౌళి బాగా ప్రమోట్ చేస్తూ ఉంటాడు. దీనితో నిఖిల్ సెంటిమెంట్ కు రాజమౌళి అడ్డుగా మారుతాడా అన్న సెటైర్లు ఫిలింనగర్ లో వినపడుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: