తెలుగు నాట టెంపర్ ఎంత సంచలనం సృష్టందో అందరికీ తెలిసిన విషయమే. విడుదలైన అన్ని కేంద్రాల్లో టెంపర్ తన టెంపర్ ని చూపిస్తుంది . గతకొన్నాళ్లనుంచి ఒక్క సక్సెస్ లేక సతమతమవుతున్న ఎన్టీఆర్ కి ఈ చిత్రం ఊరటనిచ్చింది. విమర్శకులు సైతం ఈ చిత్రంపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన ‘టెంపర్’ హిందీ రీమేక్ రైట్స్ ని ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ సన్నిహితుడైన నటుడు సచిన్ జోషి సొంతం చేసుకున్నాడు.

దీంతో హిందీ వెర్షన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో సచిన్ జోషీయే హీరోగా నటిస్తారని అంతా భావించారు. కానీ ఆ వార్తలను అతను కొట్టిపారేస్తూ.. ఓ పెద్ద హీరో కోసం వెతుకుతున్నానంటూ అప్పట్లో పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ పెద్ద హీరో దొరికినట్లు బాలీవుడ్ సమాచారం! బాలీవుడ్ లో మంచి రన్నింగ్ లో ఉన్న హీరో అంతే కాదు ఆ పాత్రకు సూటబుల్ హీరో దొరికాడని సచిన్ జోజీ అన్నాడు.

ఈ పాత్ర కోసం పెద్ద హీరోలనే సంప్రదించినప్పటికీ ఆ జోష్ అలాంటి మేనరీజం ఉన్న హీరో రణ్విర్ సింగ్ అని అతన్ని ఫైనల్ చేసుకున్నట్లు తెలిపాడు. గతంలో కూడా రణ్వీర్ విలనీజం ఉండీ తర్వాత హీరోయిజం చూపించిన సినిమా గుండే మంచి యాక్షన్ భరిత చిత్రం నటించిన విషయం తెలిసిందే. ఒక అవినీతిపరుడైన పోలీసాఫీసర్ చివరికీ నిజాయితీపరుడిగా ఎలా మారాడన్న అంశం చుట్టు మూవీ కథ వుంటుందన్న విషయాన్ని తెలియజేయగా..

అందుకు అతను ఆకర్షితుడై ఓకే అన్నట్లు సమాచారం! అయితే.. ఈ విషయాన్ని సచిన్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇక ఈ మూవీని తెలుగులో తెరకెక్కించిన పూరీ జగన్నాథ్.. హిందీ రీమేక్ కి కూడా దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలువడి కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: