మహేష్‌ హీరోగా మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రిమూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇదో చక్కని కుటుంబ కథతో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. వినోదం పుష్కలంగా ఉంటూనే, కథా బలం, సన్నివేశ బలం ఉండేలా, లాజిక్‌ వర్కవుట్‌ అయ్యేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కొరటాల.

రొటీన్ కథలకు కాస్త దూరంగానే ఉంది అనిపించేలా కొరటాల కథని తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టాక్స్ బయటకువచ్చాయి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోంది. ఈ చిత్రానికి శ్రీమంతుడు, జమీందారు అన్న టైటిల్స్ వినిపిస్తున్నాయి.

ఈ రెండింటిలో శ్రీమంతుడు టైటిల్‌ను ఖరారు చేసే అవకాశం వున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఉగాది కానుకగా మార్చి 21న విడుదల చేయాలని చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో మహేష్ బాబు చాలా క్లాస్ లుక్ లో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. చిత్ర యూనిట్ కొన్ని ఫస్ట్ లుక్ శాంపిల్స్ ని ప్రిన్స్ కి కూడ చూపించారట. వాటిలో కొన్ని ఫుస్ట్ లుక్స్, మహేష్ ని అమితంగా ఆకట్టుకుంటున్నట్టు తెలుస్తుంది.

మొత్తంగా శ్రీమంతుడు మూవీ ఫస్ట్ లుక్ పై అభిమానులు కూడ తెగ ఆశక్తి చూపుతున్నారు. పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి కాగానే చిత్ర యూనిట్ 12 రోజుల షెడ్యూల్ కోసం ఫ్రాన్స్‌కు వెళ్లనుందని తెలిసింది. ఆగడు ఫలితాన్ని దృష్టిలోపెట్టుకుని దర్శకుడు కొరటాల శివ ఈ చిత్ర కథ, కథనం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పూర్ణ ప్రత్యేక గీతంలో కనిపించబోతున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: