మెగా పవర్ స్టార్ చరణ్ డబ్బు సమంత వద్దకు చేరడంతో సమంత తన పై తాను విధించుకున్న షరతులను తొలగించు కుంది. కొద్ది రోజుల క్రితం సమంత తన ట్విటర్ లో ఒక మెసేజ్ పోస్ట్ చేస్తూ కొద్ది రోజుల పాటు తాను ఎవ్వరికీ అందుబాటులో ఉండనని అందరికీ మంచి జరగాలి అంటూ వెబ్ మీడియా మౌన వ్రతాన్ని మొదలు పెట్టింది.

అయితే ఈలోగా అనుకోకుండా చరణ్ నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఆ కార్యక్రమంలో తాను గెలుచుకున్న 3.20 లక్షలను సమంత వెనుక ఉండి ప్రోత్సహిస్తున్న ప్రత్యూష ఫౌండేషన్ కు విరాళంగా ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు.

ఈ వార్తలను ఆ కార్యక్రమంలో చరణ్ చెప్పిన మాటలను విన్న సమంత ఫిదా అయినట్లు కనిపిస్తోంది. దీనితో తన వెబ్ మీడియా మౌన వ్రతాన్ని వీడి చరణ్ పాల్గొన్న ఆ కార్యక్రమ ఫోటోలను అందరికీ షేర్ చేస్తోంది. రామ్ చరణ్ తో శ్రీనువైట్ల తీయబోతున్న సినిమాలో సమంత బదులు రకుల్ వచ్చి చేరడంతో సమంతకు కోపం వచ్చింది అన్న మాటలు నిజం కావు అని తెలియ చేస్తున్నట్లు ఉంది సమంత ప్రవర్తన.

అంతేకాదు వెబ్ మీడియాలో సమంత సందడి చేయడం చూస్తూ ఉంటే సినిమాలలో, రాజకీయాలలో సెలెబ్రెటీలు రాజకీయవేత్తలు ఎంత బాగా నటిస్తారో మరోసారి రుజువైంది. ఏమైనా సమంత తాను క్యూట్ మాయలేడిని అని మరొక్కసారి అనిపించు కుంటోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: