మొన్నామధ్య దాసరి నారాయణ రావు సెన్సెషనల్ న్యూస్ ఒకటి చెప్పాడు అదేనండి పవన్ ను పెట్టి సినిమా తీస్తున్నట్లు అంతే ఒక్క సారిగా టాలీవుడ్ షేక్ అయ్యింది. మెగా ఫ్యామిలీతో ఏమాత్రం సంబంధం పేట్టుకోని దాసరి ఏంటీ ఈ న్యూస్ చెప్పడమేంటా..? అని అందరూ ఆశ్చర్య పోయారు.

ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో కానీ దానికి సంబంధించింది ప్రతీది ఒక సంచలనం రేకెత్తిస్తుంది. ఈ సినిమాకు పూరీ డెరెక్షన్ వహిస్తాడని కానీ పూరీ బిజీగా ఉండటం చేత ఇది క్యాన్సల్ అయ్యిందని తెలిసింది. ఆ తర్వాత ఈ సినిమాకు ఏ దర్శకులైతే బాగుంటుందని తర్జన భర్జనలు జరిగాయని రకరకాలుగా ప్రచారాలు మొదలయ్యాయి.

కానీ విటన్నిటికి తెర దించుతూ దాసరి తీయబోయో సినిమాకు మరెవరో కాదు పవనే డైరెక్టర్ అని తెలిసింది. పవన్ ఎప్పుడో అనుకున్న సత్యాగ్రహి స్టోరీని ఇప్పుడు తీయబోతున్నాడట. దీనికి దాసరి కూడా ఒకే అనడంతో ఇద్దరి మధ్య ఒప్పదం కుదిరిందని అంటున్నారు.

ఈ సినిమాను గోపాల గోపాల మాదిరిరిగా పార్టర్నర్ షిప్ గా నిర్మిస్తారట. పవన్ హీరో, డైరక్టర్ కాబట్టి మిగిలిన స్టార్ కాస్ట్, ప్రొడక్షన్ దాసరి వంతు. కానీ ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఉత్కంఠం రేపుతున్న ప్రశ్న. మొత్తానికి దాసరి, పవన్ ల కాంబి నేషన్ లో మరో సూపర్ బంబర్ హిట్ రావాలని అటు దాసరి అభిమానులు ఇటు పవన్ అభిమానులు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: