మార్చి నెల ఆఖరకు ఏదోవిధంగా ‘రుద్రమదేవి’ సినిమాను విడుదల చేద్దామని గుణశేఖర్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే మరోసారి ఈసినిమా విడుదల వాయిదా పడుతుంది అని అంటున్నారు. దీనికి ప్రధానకారణం ఈసినిమాకు సంబంధించి ఇరు రాష్ట్రాలలోను చాల ఏరియాలలో ఈ సినిమా బిజినెస్ పూర్తి కాలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

చారిత్రాత్మక సినిమా కావడంతో గుణశేఖర్ కోరుకున్న మొత్తాలకు ఈ సినిమాను కొనడానికి బయ్యర్లు వెనకడుగు వేస్తున్నారు అనే వార్తలు ఉన్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా ‘రుద్రమదేవి’ సినిమా ఆడియో వేడుకను వరంగల్‌లో వైభవంగా నిర్వహించడానికి యూనిట్ ప్లాన్ చేసుకుంటోందని టాక్.

అదేవిధంగా ఈ సినిమా షూటింగ్ పార్ట్ ఫినిష్ కావడంతో ఈ మూవీలో అనుష్క ధరించిన ఆభరణాలను చెన్నై NAC జ్యుయలర్స్ కొన్నాళ్ళు షో రూంలో ప్రదర్శనకు ఉంచి త్వరలో అమ్మకానికి పెట్టబోతున్నారని తెలుస్తోంది. సుమారు 5 కోట్ల విలువైన 5 కిలోల బంగారు ఆభరణాలు పూత పూసిన భారీ ఆభరణాలు ఎవరైనా ఒకరే కొనేలా ప్రయత్నిస్తారట. అది కుదరకుంటే విడివిడిగా అమ్మడానికి నిశ్చయించుకున్నారు అని తెలుస్తోంది.

ఈ వార్తలు ఇలా ఉండగా నిన్న ప్రసాద్ ఐమాక్స్ ధియేటర్లో ప్రత్యేకంగా ఆహ్వానించిన అతిధుల మధ్య గుణశేఖర్ ఈ సినిమా త్రీడీ ట్రైలర్ ను ఆవిష్కరించాడు. ఈ ట్రైలర్ చూసిన అతిధులు మీడియా ప్రతినిధులు గుణశేఖర్ క్రియేటివిటీని తెగ మెచ్చుకున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: