బాలీవుడ్ టాప్ హీరోలు సల్మాన్, అమీర్, షారుఖ్ ల సినిమాలు లేకుంటే బాలీవుడ్ పూర్తిగా తుడిచి పెట్టుకు పోతుంది అన్నది వాస్తవం. ప్రతి సంవత్సరం వేల కోట్ల బిజినెస్ వీరి సినిమాల పై జరుగుతూ ఉంటుంది. అటువంటి టాప్ రేంజ్ బాలీవుడ్ హీరోల సినిమాలను బహిష్కరించమని భారతీయ జనతాపార్టీ నాయకురాలు సాధ్వి ప్రాచీ ఇచ్చిన పిలుపు బాలీవుడ్ కు హాట్ న్యూస్.

మన దేశంలో అత్యధికంగా ఉన్న హిందువులు ఈ ముగ్గురు హీరోల సినిమాలను చూడకూడదని ఆమె పిలుపు ఇచ్చింది. గతంలో ఈమె మదర్ థెరిసాను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. పేద దళిత హిందువులను కొందరు క్రిస్టియన్లుగా మారుస్తున్నారు అంటూ మత మార్పడిల మీద చట్టం ఉండాలని గతంలో ఈమె చేసిన కామెంట్స్ రాజకీయ పరంగా పెనుదుమారాన్ని సృస్టించాయి.

అంతేకాదు ఈమె తన టార్గెట్ ను రాహుల్ గాంధీ పై కూడా మళ్ళించి ఈ యువనేత త్వరగా పెళ్ళి చేసుకోవాలని అదేవిధంగా ఒక భారతీయ యువతినే రాహుల్ పెళ్ళి చేసుకోవాలని ఈమె చేసిన కామెంట్స్ కూడా మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.

ఈమె వ్యాఖ్యలు ఇలా ఉండగా మరి కొద్దిరోజులలో సల్మాన్ ఖాన్ సంబంధించిన జింక పిల్ల వేటకు సంబంధించిన తుది తీర్పు న్యాయస్థానం వెల్లడిస్తూ ఉండటంతో సల్మాన్ తో సినిమాలు తీస్తున్న నిర్మాతలు తీవ్ర టెన్షన్ లో ఉన్నారని టాక్. బాలీవుడ్ మీడియా వార్తల ప్రకారం ప్రస్తుతం సల్మాన్ నటిస్తున్న సినిమాల విలువ దాదాపు 300 కోట్లు ఉంటుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: