టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ తెలుగు హీరోయిన్ ఎవరు అంటే అందులో కలర్ స్వాతి ఒకరు అని కచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే తన నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. దీంతో కలర్ స్వాతిని అందరూ ఇట్టే గుర్తుపెట్టేస్తారు. కాని, ఈ బ్యూటికి తెలుగులో వరుస ఆఫర్స్ రావటం లేదు. ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలు అయిన కోలీవుడ్, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలలో కలర్ స్వాతికి మంచి డిమాండ్ ఉంది.

తాజాగా తను ఆర్య మూవీలో బంపర్ ఆఫర్ కొట్టేసింది. కేవలం ఆఫర్ తో సరిపెట్టుకోవడమే కాకుండా, రెమ్యునరేషన్ ని సైతం ఆ విధంగానే తీసుకుంటుందనే టాక్ వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే, తెలుగులో ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ సినిమాగా వరుసగా రెండు హిట్స్ అందుకున్న బ్యూటీ, స్వాతి. ఇలా వరుసగా హిట్స్ వచ్చినా స్వాతికి తెలుగులో మాత్రం ఆఫర్స్ తక్కువగా వస్తున్నాయి.

తాజగా స్వాతికి తెలుగులో పంజా సినిమా అందించిన విష్ణు వర్ధన్ డైరెక్టర్ గా చేస్తున్న తమిళ సినిమాలో చాన్స్ వచ్చింది. ఆర్య, క్రిష్ణ, దీప సన్నిది మెయిన్ రోల్స్ లో వస్తున్న ఈ సినిమాకి ‘యాట్చన్’ అనే టైటిల్ ని పెట్టారు. ప్రసతుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. స్వాతి కూడా షూటింగ్ లో పాల్గొంటోంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. యుటివి మోషన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాని మే లో రిలీజ్ చేయనున్నారు.

ఈ మూవీలో తను నటించేందుకు ఏకంగా కోటి రూపాయలకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటుందనే టాక్స్ వినిపిస్తున్నాయి. కోలీవుడ్ లో కలర్ స్వాతి ఇప్పటి వరకూ 60 లక్షలకు మించి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకోవడంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: