సునీల్‌ హీరోగా, 'రక్ష చిత్రం లాంటి డిప్రెంట్ స్టోరితో విజయాన్ని సొంతం చేసుకున్న వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకుడిగా కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్ లో వస్తున్న మూవీకి ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్‌పిఎ క్రియేషన్స్‌ పతాకంపై ఓ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మించనున్నారు.

అయితే ఈ మూవీకి సంబంధించి నిర్మాత సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ “మా బ్యానర్‌ వాల్యూని నిలబెట్టే చిత్రం తీయాలన్న ఉద్దేశ్యంతో మంచి కథల కోసం చూస్తున్న సమయంలో 'రక్ష' చిత్రం దర్శకుడు వంశికృష్న ఆకెళ్ల మంచి కథతో రాగా నేను, సునీల్‌ వెంటనే అంగీకరించాం. త్వరలో ఈ చిత్రం సెట్‌మీదకు వెళుతుందని, అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిమస్తుందని” అన్నారు.

ఈ ప్రెస్ మీట్ జరిగిన అనంతరం హీరో సునీల్ నిర్మాతకి ఫోన్ చేసి, ఈ మూవీ హిట్ కాకుంటే తను హీరో క్యారెక్టర్స్ కి దూరంగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చినట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా, సునీల్ స్నేహితుడు అయిన త్రివిక్రమ్ సైతం, సునీల్ ని కామెడీ పాత్రలు కూడ వదులుకోకుండా చేసుకోమని సలహాలు ఇస్తున్నాడంట.

అంతే కాకుండా హీరో పాత్రల కంటే కామెడీ పాత్రలే ఎక్కువ లైఫ్ ఉంటుది? అంటూ గత కొంత కాలంగా సునీల్ కి త్రివిక్రమ్ హితబోధ చేస్తున్నట్టగా పిల్మ్ నగర్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. తన పంధాని మార్చుకోకపోతే భవిష్యత్ లో కష్టాలు చూస్తావని సునీల్ కి త్రివిక్రమ్ హెచ్ఛరించినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా సునీల్ హీరో గా రాబోతున్న ఈ భారీ చిత్రం సరైన సక్సెస్ ని అందుకోకపోతే, సునీల్ తిరిగి కమెడీ రోల్స్ చేయటానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: