మెగా నిర్మాతగా ఎన్నో భారీ సినిమాలను తీసిన అల్లు అరవింద్‌ 'బద్రినాధ్‌' తర్వాత తన బ్యానర్లో సినిమా తీయడానికి ఎందుకు భయ పడుతున్నాడు అనే ఆ శక్తికర చర్చలు ప్రస్తుతం ఫిలింనగర్ లో వినపడుతున్నాయి. తన కుటుంబంలోనే కాకుండా మెగా కుటుంబంలో ఎంతో మంది స్టార్ హీరోలు తయారైన నేపధ్యంలో అరవింద్ తలుచు కుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వారి డేట్స్‌ తీసుకుని సినిమా తీసే సత్తా ఆయనకు ఉంది.

గతంలో చిరంజీవితో ప్రతి రెండు సినిమాల తర్వాత ఒకటి తనది ఉండేలా ప్లాన్‌ చేసుకునే అల్లు అరవింద్‌ ఇప్పుడు తన గీతా ఆర్ట్స్‌ని కేవలం సినిమాల సమర్పణకే పరిమితం చేయడం వెనుక ఎదో ఒక ప్రధాన కారణం ఉండి ఉంటుంది అని చాలామంది విశ్లేషణలు చేస్తున్నారు.

అయితే ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం అరవింద్ తన సినిమా నిర్మాణ వ్యవహారాలను తన కుమారుడు అల్లు శిరీష్ కు అప్పగించాలని భావిస్తే శిరీష్ హీరోగా సెటిల్ అవ్వాలని నిశ్చయించుకోవడంతో అరవింద్ కు సినిమాల నిర్మాణం పట్ల ఆ శక్తి తగ్గింది అనే వార్తలు కూడా ఉన్నాయి. అయితే లేటెస్టుగా పవన్ నిర్మాతగా మారి రామ్ చరణ్ తో సినిమాను తీయబోతున్న నేపధ్యంలో అల్లుఅరవింద్ మరో ట్విస్ట్ కు ప్రయత్నిస్తున్నట్లు టాక్.

అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే పవన్ కళ్యాణ్ తో ఒక భారీ సినిమాను అరవింద్ తన గీత ఆర్ట్స్ బ్యానర్ పై తీయడానకి నిర్ణయించు కోవడమే కాకుండా ఆ సినిమా ద్వారా తిరిగి నిర్మాతగా తన సత్తాను చాటాలని అరవింద్ ఆలోచనా అనే రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి పవన్ అరవింద్ కోరికను మన్నిస్తాడా అన్నదే ప్రశ్న..

మరింత సమాచారం తెలుసుకోండి: